ప్రతిభగల విద్యార్థులకు నెలకు రూ. 75,000 | Sakshi
Sakshi News home page

ప్రతిభగల విద్యార్థులకు నెలకు రూ. 75,000

Published Tue, Sep 12 2017 5:25 PM

ప్రతిభగల విద్యార్థులకు నెలకు రూ. 75,000

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యాసంస్థల్లో అత్యంత ప్రతిభకనబర్చిన వెయ్యిమంది విద్యార్థులకు నెలకు రూ.75వేల స్కాలర్‌షిప్‌ ఇవ్వనున్నట్లు కేంద్రమానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. త్వరలోనే  ‘ప్రధాని స్కాలర్‌షిప్‌’ పేరిట ఈ పథకాన్ని ప్రారంభించే యోచనలో కేం‍ద్రకేబినెట్‌ ఉందని, ఈ ఫైల్‌పై సంతకం కూడా చేసానని జవదేకర్‌ స్పష్టం చేశారు. ఐఐటీ ఢిల్లీలో సుమంత్‌ సిన్హా రెన్యూ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌(సీఈవో) ఆవిష్కరణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ పథకంతో ఐఐటీ, యూనివర్సిటీల్లో ప్రతిభ కనబర్చిన పరిశోధన విద్యార్థులకు చేయుతగా ఉంటుందన్నారు.
 
దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యాసంస్థల్లో( యూనివర్సిటీ, ఐఐటీ) అత్యంత ప్రతిభ కనబర్చిన టాప్‌ వెయ్యి మందికి ఈ స్కాలర్‌ షిఫ్‌లను అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇది చిన్న విషయం కాదని, ఇలాంటి పథకం ప్రారంభించడం దేశ చరిత్రలోనే తొలిసారన్నారు. దేశంలో ప్రతిభావంతులను వెలికితీయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని నొక్కి చెప్పారు. ఇక ఐఐటీల్లో ప్రస్తుతం 8 శాతం ఉన్నమహిళల సంఖ్య 2022లో 20 శాతం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశ్వజీత్‌ ప్రాజెక్టు, ఉచ్చాతర్‌ అవిష్కార్‌ పథకంతో ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధన విభాగాలను పటిష్టం చేస్తున్నామని ఈ సందర్భంగా జవదేకర్‌ తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement