బెంగళూరు: రాహుల్ గాంధీని కించపరిచేలా ఉందని కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీ ఓ కార్టూన్ను తొలగించింది. ముఖ్యంగా కుందపుర నియోజక వర్గంలో ఏ చోట కూడా ఈ కార్టూన్ లేకుండా తొలగించింది. ఇలాంటి కార్టూన్ వేయడం నేరం కిందకు వస్తుందని కూడా హెచ్చరించింది. ఇంతకీ ఆ కార్టూన్ ఎవరు గీశారు? అందులో ఏముంది అనే విషయం పరిశీలిస్తే.. సతీశ్ ఆచార్య అనే వ్యక్తి కార్టూనిస్టుగా పనిచేస్తున్నాడు. ఆయన కుందపురాలోని తన ఇంటి వద్ద నుంచే కార్టూన్లు వేస్తుంటాడు.
కార్టూన్ కార్నర్ పేరిట వేసే కార్టూన్లను ఆయా పార్టీలు తమకు నచ్చిన ప్రాంతాల్లో హోర్డింగ్లుగా ఏర్పాటుచేసుకుంటాయి. అందులో భాగంగానే ఆయన ఇటీవల రాహుల్ గాంధీ, సిద్ధ రామయ్య, ప్రధాని నరేంద్రమోదీ, కర్ణాటక మ్యాప్తో ఒక కార్టూన్ వేశారు. కాంగ్రెస్ రహిత భారత్ అంటూ దానికి పేరు పెట్టారు. అందులో మోదీ వేగంగా కర్ణాటక రాష్ట్రంపై అడుగుపెట్టి దూసుకొస్తుండగా సిద్ధ రామయ్య వెనుక రాహుల్ దాక్కొని నన్ను రక్షించండి సిద్ధ రామయ్యజీ అంటూ వ్యాఖ్య ఉండగా.. సిద్ధ రామయ్య కూడా అలాగే బెంబేలెత్తిపోతూ నన్ను రక్షించండి రాహుల్ జీ అంటూ వ్యాఖ్యానించినట్లుగా కార్టూన్ ఉంది.
ఈ కార్టూన్నే కర్ణాటకలో తొలగించారు. దీనిపై కార్టూనిస్టు సతీశ్ ఆచార్య వివరణ ఇస్తూ 'నేను అన్ని రాజకీయ పార్టీల కార్టూన్లు గీశాను. నాకు ఎవరూ సమస్యను సృష్టించలేదు. కానీ, ఈ కార్టూన్ పెట్టిన తర్వాత స్థానిక కాంగ్రెస్ నేత నన్ను పిలిచి దానిని తీసేయాలని లేదంటే నేరం అవతుందని చెప్పారు. ఆ మరుసటి రోజే అధికారులు దానిని తొలగించారు. తన ముందున్న సవాళ్ల గురించి కాంగ్రెస్ ఆందోళనకు గురికావాలి గానీ.. కార్టూన్ చూసి కాదు' అని ఆయన అన్నారు. ఈ విషయాన్ని తాను కాంగ్రెస్ అధిష్టానాన్ని సంప్రదించినా ఇంకా సమాధానం రాలేదని చెప్పారు.
'అసలుది విడిచి.. కార్టూన్కే కంగారెందుకు?'
Published Fri, Jun 10 2016 1:02 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
చెస్ గ్రాండ్మాస్టర్ల కర్మాగారంలా మారిన భారత్.. 1987లో ఒక్కరే.. ఇప్పుడు..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement