సాక్షి,న్యూఢిల్లీః ఆదాయ పన్ను అధికారులూ లంచాలు తీసుకుంటూ అడ్డంగా బుక్కవుతున్నారు. రూ 3 కోట్ల ముడుపులు స్వీకరించారనే ఆరోపణలపై ముంబయికి చెందిన డిప్యూటీ ఇన్కమ్ట్యాక్స్ కమిషనర్ను సీబీఐ అరెస్ట్ చేసింది..
ఐటీ అధికారి వ్యవహారంలో సోదాలు కొనసాగుతున్నాయని సమాచారం. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినట్టు సీబీఐ ప్రతినిధి శుక్రవారం వెల్లడించారు. అరెస్ట్ అయిన అధికారిని జైస్వాల్ స్వామిగా గుర్తించినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి.