ఉమేశ్కుమార్ ‘ఫోర్జరీ’పై దర్యాప్తు కొనసాగుతుంది: సుప్రీం
సాక్షి లీగల్ ప్రతినిధి, న్యూఢిల్లీ: రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వి.దినేశ్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై అత్యున్నత న్యాయస్థానం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. అలాగే దినేశ్రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు పార్లమెంటు సభ్యుడు ఎం.ఎ.కాన్ సంతకాలను ఫోర్జరీ చేశారన్న ఆరోపణలపై ఐపీఎస్ అధికారి ఉమేశ్కుమార్పై కూడా విచారణ కోర్టులో విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. డీజీపీపై ఫిర్యాదు కాపీని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపించి దర్యాప్తు చేపట్టాల్సిందిగా నిర్దేశించినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆరోపణలపై ఎలాంటి దర్యాప్తూ చేపట్టకపోవటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. ‘రాష్ట్ర పోలీస్ బాస్పై వచ్చిన ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిం చటం దిగ్భ్రాంతి కలిగించింది’ అని పేర్కొంది. డీజీపీపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని, దర్యాప్తుపై స్థాయీ నివేదికను నాలుగు వారాల్లో తమకు సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.
రాష్ట్రానికే చెందిన ఐపీఎస్ అధికారి ఉమేశ్ కుమార్ దాఖలుచేసిన అప్పీలును విచారించిన జస్టిస్ బి.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డేలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈమేరకు ఆదేశాలు జారీచేసిం ది. డీజీపీ దినేశ్రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు ఉమేశ్కుమార్ ఒక ఎంపీ సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఫిర్యాదు చేయటానికి ఫోర్జరీ చేసినప్పటికీ.. దినేశ్రెడ్డిపై చేసిన ఆరోపణల్లో బలం ఉన్నందున దీనిపై దర్యాప్తు అవసరమని ధర్మాసనం పేర్కొంది. ‘ఫిర్యాదు బూటకమైనప్పటికీ, దానితో జతపరిచిన సేల్ డీడ్లను అక్రమమార్గంలో సేకరించినవైనప్పటికీ, ఆ పత్రాలు బూటకపు పత్రాలుగా నిర్ధారణకాలేదు. ఆరోపణల్లో కొంత బలం ఉన్నట్లయితే, ప్రతివాదికి (దినేశ్రెడ్డికి) నేరంలో భాగస్వామ్యం ఉన్నదని బలప రచే భౌతిక ఆధారాలు ఉన్నట్లయితే.. ఈ కేసును పూర్తిస్థాయిలో పరిశీలించాలి.. అంతేకానీ కక్ష సాధించటానికో, మరేదో స్వార్థ లక్ష్యం కోసమో ఫిర్యాదు చేశారనే ప్రాతిపదిక మీద దానిని కొట్టివేయకూడదు’ అని స్పష్టంచేసింది.
డీజీపీ దినేశ్రెడ్డి ఆస్తులపై సీబీఐ దర్యాప్తు
Published Sat, Sep 7 2013 2:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement