భోపాల్: యూపీఏ ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి సీబీఐని వాడుకుంటోందని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ అన్నారు. ఈ విషయంలో కేంద్రం తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఇక్కడ జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో జరగనున్న ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోగానీ, లోక్సభకు జరిగే తదుపరి సాధారణ ఎన్నికల్లోగానీ కాంగ్రెస్ పోటీ చేయదని, బదులుగా తన తరఫున సీబీఐనే రంగంలోకి దింపుతుందని మోడీ ఎద్దేవా చేశారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం బీజేపీ, ఎన్డీయే కూటమి పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపుతోందని, ఇటువంటి సర్కారును తక్షణం కూలదోయాల్సిన అవసరం ఉందని ఆయన విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు గుణపాఠం నేర్పడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ అవినీతినుంచి దేశాన్ని విముక్తం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహాత్మాగాంధీ ఆఖరి కోరిక మేరకు కాంగ్రెస్ను మూసేయాల్సిన అవసరం ఉందని మోడీ అన్నారు.
ఒకే వేదికపై మోడీ, అద్వానీ: బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్రమోడీ బుధవారం ఒకే వేదికపై కనిపించారు. భోపాల్లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో వీరు కలిసి పాల్గొన్నారు. మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాక, వీరు బహిరంగ వేదికలపై కలసి పాల్గొనడం ఇదే తొలిసారి. అయితే వారిద్దరి మధ్య సఖ్యత కనిపించలేదు. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడాన్ని అద్వానీ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. పార్టీ కార్యకర్తలు కష్టించి పనిచేయడంవల్లే బీజేపీ నేడు ఇంతటి స్థితికి చేరుకుందని, అంతేకాని నాయకుల అనర్గళ ఉపన్యాసాలవల్ల కాదని అద్వానీ ఈ సందర్భంగా అన్నారు.
కమిటీలకే కేంద్రం పరిమితం
అహ్మదాబాద్: దేశంలోని యువతకు నైపుణ్యాలను పెంచడంలో కేంద్రం విఫలమైందని మోడీ ధ్వజమెత్తారు. ఈ విషయంలో కేంద్రానికి ఒక విధానమంటూ లేకుండా పోయిందని అన్నారు. గుజరాత్లోని గాంధీనగర్లో బుధవారం ఆయన జాతీయ నైపుణ్య అభివృద్ధి సదస్సును ప్రారంభించారు. కేంద్రం ఏ సమస్య వచ్చిన కమిటీలు వేయడం, వాటిని మూసేయడం వరకే పరిమితం అవుతోందని అన్నారు. కేంద్రం సాచివేత ధోరణివల్ల విలువైన సమయం వృథా అయిందని, యువత నైపుణ్యాలను పెంచుకునే అవకాశం కోల్పోయిందని పేర్కొన్నారు. 2008లో కేంద్ర ప్రభుత్వం జాతీయ నైపుణ్య అభివృద్ధి కేంద్రం పేరుతో మంత్రులతో కమిటీని ఏర్పా టు చేసిందని తర్వాత జాతీయ అభివృద్ధి బోర్డును నెలకొల్పిందని, అయితే ఈ రెండూ ఇప్పటివరకు సాధించిందేమీ లేదని అన్నారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ బదులు సీబీఐ :మోడీ
Published Thu, Sep 26 2013 5:14 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement