గాల్లో 30అడుగులు పిట్టల్లా ఎగిరిపడ్డారు | Sakshi
Sakshi News home page

గాల్లో 30అడుగులు పిట్టల్లా ఎగిరిపడ్డారు

Published Tue, Apr 18 2017 9:13 PM

గాల్లో 30అడుగులు పిట్టల్లా ఎగిరిపడ్డారు - Sakshi

పుణెలో దారుణం.. రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న ఓ ఐదుగురు వ్యక్తులను వేగంగా వచ్చిన కారు అమాంతం ఢీకొట్టింది. దీంతో అందులోని ఇద్దరు కనీసం 30 అడుగుల దూరంలో ఎగిరి పడగా ఇద్దరు కారు కిందే ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో మూడేళ్ల ఇషా విశ్వకర్మ అనే పాప అక్కడికక్కడే చనిపోయింది. విశ్వకర్మ అనే ఆమె తల్లి పూజ విశ్వకర్మ కూడా ఆస్పత్రిలో 24గంటలపాటు ప్రాణాలకై పోరాడుతూ చివరకు కన్నుమూసింది.

పట్టపగలే అత్యంత భయానకంగా చోటు చేసుకున్న ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. కారు నడిపింది సుజాత ష్రాఫ్‌ అనే ఓ మహిళ. ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం మధ్యాహ్నం 2.45గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియోలో రికార్డయిన ప్రకారం ముందుగా రోడ్డు దాటేందుకు సగం దాటిని వారు డివైడర్‌పై వచ్చి నిల్చున్నారు. పూజ తన కూతురు ఇషాను చేతులో పట్టుకొని ఉంది. మరో ముగ్గురు పెద్దపెద్ద సంచులతో అదే డివైడర్‌పై ఉన్నారు. వాహనాల తాకిడి తగ్గాక రోడ్డు దాటుదామనుకున్నారు. ఈలోగా నేరుగా డివైడర్‌పైకి వచ్చిన కారు అమాంతం ఢీకొట్టడంతో గాల్లో పిట్టల్లాగా లేచి పడ్డారు.

Advertisement
Advertisement