అర్థరాత్రి వీరంగం | Sakshi
Sakshi News home page

అర్థరాత్రి వీరంగం

Published Tue, Jan 12 2016 4:22 PM

CCTV shows unidentified men opening fire, vandalizing vehicles in Jodhpur

జోధ్పూర్: నేరాల నిరూపణలో సీసీటీవీల పాత్ర రోజు రోజుకు బాగా పెరుగుతోంది. తాజాగా వాహనాల ధ్వంసం కేసును విచారిస్తున్న రాజస్థాన్‌లో పోలీసులకు దిమ్మతిరిగే వాస్తవాలు కనిపించాయి. స్థానికంగా ఉన్న పార్కింగ్ ఏరియాలో గుర్తుతెలియని యువకులు సృష్టించిన వీరంగం అంతా ఇంతాకాదు. సీసీటీవీ ఫుజేజిని పరిశీలిస్తున్న క్రమంలో నివ్వెరపోయే నిజాలు వెలుగుచూశాయి. జోధ్‌పూర్‌లో అర్ధరాత్రి ఒకచోట పార్కింగ్ చేసిన కార్లు, ఇతర వాహనాలను కొందరు దుండగులు ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజిలో స్పష్టంగా కనిపించాయి.
 
కొంతమంది మారణాయుధాలతో కాపలా కాస్తుండగా, మరికొంతమంది వాహనాలపై రాడ్లతో దాడిచేశారు. అక్కడున్న వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు.  మళ్లీ మళ్లీ దాడిచేసి... అనంతరం కాల్పులు జరిపి అక్కడి నుంచి ఉడాయించారు. ఈ దృశ్యాలు పోలీసులను నివ్వెరపరిచాయి. కాగా కేసు నమోదుచేసిన పోలీసులు ఫుటేజి ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement