ప్రధాని నివాసంలో కేంద్ర కేబినెట్‌ భేటీ | Sakshi
Sakshi News home page

ప్రధాని నివాసంలో కేంద్ర కేబినెట్‌ భేటీ

Published Wed, Apr 15 2020 6:20 PM

Central Cabinet Meeting At PM Home - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న తరుణంలో కేంద్ర కేబినెట్‌ సమావేశమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో బుధవారం సాయంత్రం ఈ భేటీ ప్రారంభమైంది. వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ వంటి కీలక అంశాలపై మంత్రిమండలి చర్చించనుంది. అలాగే ఏప్రిల్‌ 20 తరువాత దేశంలోని పలు ప్రాంతాల్లో​ లాక్‌డౌన్‌ను సడలించనున్న నేపథ్యంలో దీనిపై కూడా ప్రధాని మంత్రులతో చర్చించనున్నారు. కాగా దేశంలో మొత్తం 11,933 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మృతుల సంఖ్య  392కి చేరింది.

Advertisement
Advertisement