సాక్షి, ముంబై: లోకల్ రైలు-ప్లాట్ఫారం మధ్యనున్న ఖాళీ స్థలంలో నుంచి కిందపడి అనేక మంది ప్రా ణాలు, మరికొందరు కాళ్లు, చేతులు పొగొట్టుకుం టున్నారు. ఇలాంటి సంఘటనలకు అరికట్టేందుకు రైల్వే పరిపాలన విభాగం తమ వంతుగా చేస్తున్న ప్రయత్నాలు అనుకున్నంత మేర ఫలితాలను ఇవ్వ డం లేదు. దీంతో వీటికి పూర్తిగా ఫుల్స్టాప్ పెట్టేం దుకు ముంబైలోని ఐఐటీకి చెందిన ‘ఇండియన్ డిజైనర్ సెంటర్’ విద్యార్థులు ఓ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు.
‘ర బ్రీ ప్లాట్ఫారం గ్యాప్ ఫిల్లర్స్’ పేరిట రబ్బరుతో పరికరాన్ని తయారుచేశారు. అం దుకు సంబంధించిన నమూనా చిత్రాన్ని విడుదల చేశారు. ప్రయోగాత్మకంగా కొన్ని నిర్దేశిత స్టేషన్లలో ముందుగా ఏర్పాటు చేస్తారు. మంచి ఫలితాలు వస్తే అన్ని స్టేషన్లలో, అన్ని ప్లాట్ఫారాలపై ఈ రబ్బ రు పరికరాన్ని ఏర్పాటు చేస్తారని దీన్ని తయారుచేసిన అరుణ్రాజ్ అనే విద్యార్థి చెప్పారు. దీనివల్ల ప్లాట్ఫారం-లోకల్ రైలు బోగీ మధ్యలో ఉండే ఖాళీ స్థలం ఈ రబ్బరు పరికరం ద్వారా పూర్తిగా మూసుకుపోతుంది.
రైలు ఎక్కే సమయంలో లేదా దిగే సమయంలో అదుపుతప్పి ప్రయాణికులు కిందపడే అవకాశముండదని ఇండియన్ డిజైనర్ సెంటర్ విద్యార్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ముంబై లోకల్ రైళ్లలో ప్రతీరోజు దాదాపు 75 లక్షల మందికిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా ఈ రైళ్లు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికులతో కిటకిటలాడుతుంటాయి. విపరీతమైన రద్దీ కారణంగా రైలు ఎక్కే సమయంలో లేదా దిగే సమయంలో తోపులాటలు పరిపాటే. ఈ గందరగోళంలో అదుపుతప్పి ఖాళీ స్థలంలోంచి ప్రయాణికులు కిందపడుతున్నారు.
ఇందులో కొందరి ప్రాణాలు పోగా, మరికొందరు తమ అవయవాలు కోల్పోతున్నారు. ఫిబ్రవరి, మార్చిలో పరీక్షలు రాసేందుకు వెళుతున్న ఓ విద్యార్థిని, ఉద్యోగానికి వెళుతున్న ఓ యువతి, మరో మహిళ ఇలాగే కిందపడి చేతులు పొగొట్టుకున్నారు. ఆ సమయంలో ఈ ఘటనలు స్థానికంగా సంచలనం సృష్టించాయి. ఇలాంటి సంఘటనలు ప్రతీరోజు నగరంలో ఏదో ఒక స్టేషన్లో జరుగుతూనే ఉంటాయి.
ప్లాట్ఫారం-రైలు మధ్యలో 20- 25 ఇంచ్ల ఖాళీ స్థలం ఉంటుంది. ఇందులో నుంచి మనిషి సులభంగా కింద పడిపోతాడు. ఈ ఖాళీ లేకుండా చేయాలని తలంచి 24 స్టేషన్లలో ఐఐటీ విద్యార్థులు అధ్యయనం చేశారు. చివరకు రబ్బరుతో పరికరాన్ని తయారుచేశారు. త్వరలో కొన్ని కీలకమైన స్టేషన్లలో ఈ పరికరాన్ని ప్రయోగాత్మకంగా బిగిస్తామని ఇండియన్ డిజైనర్ సెంటర్ విద్యార్థులు తెలిపారు.
‘గ్యాప్ ఫిల్లర్’తో ప్రమాదాలకు చెక్
Published Sun, Jun 29 2014 10:28 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఒకప్పుడు ఎన్నో కష్టాలు.. పాన్ ఇండియా హీరో అయ్యాడు!
వేసవిలో నెయ్యిని తీసుకుంటే బోలెడన్ని లాభాలు!
టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు
HBD Pat Cummins: సన్రైజర్స్ కెప్టెన్ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)
జేపీ నడ్డాకు పోలీసుల సమన్లు
కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారు: లక్ష్మీ పార్వతి
ఉద్యోగుల తొలగింపు..టీసీఎస్లో అసలేం జరుగుతోంది?
టీడీపీ నేతల రౌడీయిజం.. పిన్నెల్లి భార్యకు గాయాలు
Haryana: మైనార్టీలో బీజేపీ! మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
పాక్ను ఓడించగానే రాత్రంతా సంబరాలు: రషీద్ ఖాన్
తప్పక చదవండి
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement