సాక్షి, ముంబై: రోజురోజుకు రోడ్లపైకి వస్తున్న ప్రైవేటు వాహనాల సంఖ్య పెరగడంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ట్రాఫిక్ను నియంత్రించలేక పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్నారు. వాహనాల సంఖ్య తగ్గితేనే ట్రాఫిక్ను నియంత్రించగలమని ట్రాఫిక్ విభాగం తేల్చేయడంతో వాహనాల సంఖ్యను తగ్గించే దిశగా రవాణా విభాగం చర్యలు తీసుకుంటోంది.
సొంత కార్లలో ఆఫీసులకు వెళ్లేవారు ప్రజారవాణాను వినియోగించుకునేలా ప్రోత్సహిస్తే వాహనాల సంఖ్య తగ్గే అవకాశముందని భావించిన అధికారులు ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. సొంత వాహనాలకు బదులుగా షేర్ ట్యాక్సీలను వినియోగించుకునేలా చేస్తే ఖర్చు తగ్గడంతోపాటు రహదారులపై ట్రాఫిక్ కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. ఈ విషయమై ముందుగా అభిప్రాయ సేకరణ జరుపనున్నట్లు రవాణా విభాగా అధికారి ఒకరు తెలిపారు.
వ్యాపార సంస్థలు ఎక్కువగా ఉన్న రైల్వే స్టేషన్ల ఆవరణలో షేర్ ట్యాక్సీలను అందుబాటులో ఉంచడం ద్వారా ఒకే ప్రాంతానికి వెళ్లే ప్రయాణికులంతా ఈ ట్యాక్సీని ఆశ్రయిస్తారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా దూరప్రాంత ప్రయాణికుల కోసం కూడా ఈ సౌకర్యం కల్పించడం ద్వారా ఒకే రూట్లో వెళ్తున్న ట్యాక్సీల రద్దీని కూడా కొంత మేర తగ్గించవచ్చని చెబుతున్నారు. షేర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకు రావడంతో కార్లు ఉన్న వారు కూడా తమ కార్లను ఇంటి వద్దనే ఉంచుతారని, అంతేకాకుండా వీరికి పార్కింగ్ రుసుము చెల్లించే ఖర్చు కూడా తప్పుతుందని చెబుతున్నారు.
ముఖ్యంగా నవీముంబై, ఠాణే తదితర సుదూర ప్రాంతాల నుంచి నగరానికి పనుల నిమిత్తం వచ్చే ఉద్యోగులకు షేర్ ట్యాక్సీలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని కూడా చెబుతున్నారు. ములుండ్ నుంచి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వరకు, అంధేరి నుంచి చర్చ్గేట్ వరకు, బాంద్రా నుంచి పరేల్ వరకు షేర్ ట్యాక్సీలను నడిపితే ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు. దీంతో షేర్ ఆటోల కోసం స్టాండ్లను ఏర్పాటు చేయడానికి స్థలాన్ని గుర్తించాలని రవాణా విభాగం అధికారులు సూచించారు. ఈ సదుపాయం అందుబాటులో ఉన్నట్లు ప్రయాణికులకు తెలపడం కోసం ప్రకటనలు కూడా ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
డ్రైవరు పూర్తి వివరాలతోపాటు షేర్ ఆటో చార్జీల వివరాలను ఆటో స్టాండ్లు, వెబ్సైట్లలో పొందుపర్చాలని, దీంతో ప్రయాణికులు కూడా తాము వెళ్లాల్సిన గమ్యస్థానానికి సంబంధించిన ఆటో స్టాండ్ను ఆశ్రయిస్తారని చెబుతున్నారు. ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే చాలా మంది ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయమై స్థానిక ఉద్యోగి ఒకరు మాట్లాడుతూ... ఖార్గర్ నుంచి పరేల్ వరకు రోజు ట్యాక్సీలో వెళ్తాను. నాతోపాటు ఈ మార్గంలో వెళ్లే మరికొంతమంది ప్రయాణికులను కూడా డ్రైవర్ ట్యాక్సీలో ఎక్కించుకుంటాడు.
అయితే నేను డ్రైవరుకు ఎప్పుడు అడ్డు చెప్పలేదు. నా ఒక్కడినే తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తే అతను అడిగినంత చార్జీ ఇవ్వాల్సి వస్తుంది. అదే మరికొంత మంది ట్యాక్సీలో ఎక్కడం ద్వారా చార్జీని మేమందరం షేర్ చేసుకున్నట్లవుతుంది. ఇప్పటికే కొన్ని మార్గాల్లో షేర్ ట్యాక్సీలు నడుస్తున్నాయ’న్నారు. ఇదిలాఉండగా ఈ ప్రక్రియను తాము కూడా స్వాగతిస్తామని ముంబై ట్యాక్సీమెన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అల్ క్వాడ్రోస్ తెలిపారు.
ట్రాఫిక్ సమస్యకు ‘షేరింగ్’తో చెక్!
Published Mon, Jul 28 2014 10:44 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
'రింకూ ఒక అద్బుతం.. కానీ అతడిని సెలక్ట్ చేయలేకపోయాం'
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్
T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
దగాకోరు చంద్రబాబుతో తస్మాత్ జాగ్రత్త: పేర్ని నాని
ఓటర్ల అవగాహన కోసం కాలేజీ విద్యార్థులు వినూత్న ప్రదర్శన (ఫోటోలు)
మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
దుబాయ్లో మళ్లీ దంచికొడుతున్న వాన.. పలు విమానాలు రద్దు
బ్రిజ్భూషణ్కు హ్యాండ్ ఇచ్చిన బీజేపీ.. సిట్టింగ్ ఎంపీకి నో ఛాన్స్
చంద్రబాబు పగ.. ఫస్టొచ్చింది.. పెన్షన్ రాలేదు
చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న
తప్పక చదవండి
- అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
- Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్గా గృహప్రవేశం (ఫోటోలు)
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- సీరియల్ నటి సీమంతం.. ఫోటోలు వైరల్
- సురేశ్ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు మృతి
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్లో వారిద్దరే ఉన్నారు.. ఎన్టీఆర్ లేడు: రాజమౌళి
- ధోని తీరుపై విమర్శలు.. ఊహించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు
Advertisement