భారత గగనతలంలోకి చైనా ఆర్మీ హెలికాప్టర్లు | Sakshi
Sakshi News home page

భారత గగనతలంలోకి చైనా ఆర్మీ హెలికాప్టర్లు

Published Mon, Jun 5 2017 12:59 AM

భారత గగనతలంలోకి చైనా ఆర్మీ హెలికాప్టర్లు - Sakshi

న్యూఢిల్లీ: రెండు చైనా ఆర్మీ  హెలికాప్టర్లు  భారత గగనతలంలోకి వచ్చి ఐదు నిమిషాల తర్వాత తిరిగి వెళ్లాయి. ఉత్తరాఖండ్‌ చమోలీ జిల్లాలోకి ఇవి శనివారం వచ్చినట్లు అధికారులు చెప్పారు.

చైనా హెలికాప్టర్లు, విమానాలు అనుమతి లేకుండా భారత గగనతలంలోకి ప్రవేశించడం ఈ ఏడాది మార్చి నుంచి ఇది నాలుగోసారి. భారత భద్రతా దళాలు ఎక్కడెక్కడ ఉన్నాయో రహస్యంగా కనుగొనేందుకు ఈ హెలికాప్టర్లు వచ్చాయని భావిస్తున్నారు.

Advertisement
Advertisement