మధ్యప్రదేశ్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీకేజి | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీకేజి

Published Sat, Nov 29 2014 7:46 PM

chlorine gas leaked from madhyapradesh factory

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రైసెన్ జిల్లాలో ఓ రసాయన ఫ్యాక్టరీ నుంచి క్లోరిన్ వాయువు లీకైంది. ఆ ఫ్యాక్టరీకి పరిసరాల్లో ఉన్న 39 మందిపై ఈ వాయువు ప్రభావం పడింది.

వారిలో 29 మందిని రైసెన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వాళ్లలో ముగ్గురి పరిస్థితి విషమంగా మారడంతో.. వారిని రాజధాని నగరమైన భోపాల్లో మరో ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ లీక్ కావడానికి కారణాలు మాత్రం ఇంకా తెలియరావాల్సి ఉంది.

Advertisement
Advertisement