క్యాన్సర్తో దిగ్విజయ్ కుమార్తె మృతి | Sakshi
Sakshi News home page

క్యాన్సర్తో దిగ్విజయ్ కుమార్తె మృతి

Published Fri, Apr 29 2016 5:10 PM

క్యాన్సర్తో దిగ్విజయ్ కుమార్తె మృతి - Sakshi

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చిన్న కుమార్తె కర్ణికా సింగ్ (37) అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఢిల్లీలోని మాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కర్ణికా సింగ్ శుక్రవారం ఉదయం మరణించారు. ఆమెకు భర్త, ఏడేళ్ల కుమారుడు ఉన్నారు. ఏడాది క్రితం ఆమె అమెరికాలో క్యాన్సర్కు ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయితే అనారోగ్యం మరోసారి తిరగబెట్టడంతో కొద్దిరోజుల క్రితం కర్ణిక  మాక్స్ ఆస్పత్రిలో చేరారు.

కర్ణికా మృతి పట్ల  కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తదితరులు సంతాపం తెలిపారు. లోధీ ఎస్టేట్లోని దిగ్విజయ్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో కర్ణికా సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి. దిగ్విజయ్ మొదటి భార్య ఆశా సింగ్ కూడా క్యాన్సర్తో 2013లో మృతి చెందారు. కాగా కర్ణికా మృతి పట్ల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ట్విట్ చేశారు.

Advertisement
Advertisement