న్యూఢిల్లీ: మరో ఐదు నెలల్లో పశ్చిమ బెంగాల్కు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే అంశంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తర్జనభర్జన పడుతోంది. క్రితంలాగే పాలకపక్ష తృణమూల్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలా లేదా సీపీఎం పార్టీతో పొత్తుపెట్టుకోవాలనే అంశంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే విషయమై సీపీఎం, కోల్కతాలో ప్రస్తుతం జరగుతున్న పార్టీ ప్లీనరీలో చర్చలు జరుపుతోంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు తామేమి వ్యతిరేకం కాదన్న అభిప్రాయాన్ని ఆ పార్టీ నాయకుడు కారత్ ఇప్పటికే వ్యక్తం చేశారు.
సీపీఎంతో పెట్టుకోవడం మంచిదని బెంగాల్ కాంగ్రెస్ నాయకత్వం బలంగా కోరుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ పార్టీతో పొత్తుపెట్టుకోవడమే అన్ని విధాల కలిసొచ్చే అంశమని వారు భావిస్తున్నారు. దీనికి రెండు కారణాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. వాటిలో ఒకటి ఇటీవల ముగిసిన శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో పార్టీతో తృణమూల్ కలసిరావడం. నేషనల్ హెరాల్డ్ వివాదంలో కాంగ్రెస్ పార్టీకీ తృణమూల్ అండగా నిలవడమే కాకుండా కాంగ్రెస్తోపాటు సమావేశాలను బాయ్కాట్ చేయడం తెల్సిందే. మరో కారణం...కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రస్ పార్టీ నాయకత్వంలోని యూడీఎఫ్, వామపక్షాల నాయకత్వంలోని ఎల్డీఎఫ్ను ఎదుర్కోవాల్సి ఉండడం. ఓ రాష్ట్రంలో వైరి వైఖరి, మరో రాష్ట్రంలో మిత్ర వైఖరి సరిపడదంటున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభిప్రాయం.
ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఎంత సర్దిచెప్పడానికి ప్రయత్నిస్తున్నా బెంగాల్ కాంగ్రెస్ నాయకత్వం వినిపించుకోవడం లేదు. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం అధిష్టానం అభిప్రాయానికే మద్దతిస్తున్నారు. పాలకపక్షంతో వెళితే మరోసారి ఎన్నికయ్యే అవకాశాలు ఉండడమే అందుకు కారణం. 2011లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్తో కలసి పోటీ చేయడం వల్ల మొత్తం 65 సీట్లకు పోటీచేసి 42 సీట్లను గెలుచుకున్న విషయం తెల్సిందే.
బెంగాల్లో కాంగ్రెస్ పొత్తు ఎవరితో?
Published Tue, Dec 29 2015 3:24 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement