సాక్షి, న్యూఢిల్లీ:
అక్రమ మార్గాల ద్వారా ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీని అడ్డుకునేందుకు తాము అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. కాషాయ పార్టీని నిలువరించేందుకు కాంగ్రెస్, జనతాదళ్ (యు) పార్టీలతో పాటు బీజేపీలోని కొంతమంది నిజాయితీపరులైన ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో చెప్పారు. తమ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందని, అవసరమైన పక్షంలో మరిన్ని టేపులు బయటపెడతామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఓ స్టింగ్ ఆపరేషన్కు సంబంధించిన వీడియో కేజ్రీవాల్ సోమవారం బయటపెట్టిన సంగతి తెల్సిందే. బీజేపీ ఢిల్లీ శాఖ ఉపాధ్యక్షుడు షేర్సింగ్ డాగర్ సంగం విహార్ నియోజకవర్గ ఆప్ ఎమ్మెల్యే దినేష్ మొహనియాకు లంచం ఇవ్వజూపిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. తాము అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. స్వతంత్ర అభ్యర్థి రాంబీర్ షోకీన్ (ముండ్కా), జేడీ(యూ) ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్, ఆప్ బహిష్కృత సభ్యుడు వినోద్కుమార్ బిన్నీతో పాటు కాంగ్రెస్, బీజేపీలోని నిజాయితీపరులైన ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నామని తెలిపారు. తాము ప్రభుతాన్ని ఏర్పాటు చేయడానికే ఇవన్నీ చేయడం లేదని, కేవలం బీజేపీని అక్రమ మార్గాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు.
బీజేపీ కోసం ఎల్జీ తాపత్రయం
ప్రభుత్వం ఏర్పాటు కోసం సుప్రీంకోర్టు కేంద్రానికి నెల రోజుల గడువు ఇవ్వడంతో ఆమ్ ఆద్మీ పార్టీ కొంత నిరాశకు గురైంది. సుప్రీంకోర్టులో తమ పిటిషన్పై విచారణ వాయిదా పడడంతో ఆమ్ ఆద్మీ పార్టీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్పై ఆరోపణలు గుప్పించింది. న్యాయస్థానంపై తమకు నమ్మకం ఉంది కానీ లెప్టినెంట్ గవర్నర్పై లేదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. నజీబ్జంగ్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి ఆరోపించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు తగిన సంఖ్యాబలం లేదంటూ బీజేపీ డిసెంబర్లో లెప్టినెంట్ గవర్నర్కు రాసిన లేఖ ఇంకా ఆయన వద్దనే ఉందని చెప్పారు. బీజేపీ ఆ లేఖను ఉపసంహరించుకోలేదని, అటువంటప్పుడు ఎల్జీ ఏ ఆధారంతో బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలనుకుంటున్నారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఎల్జీ బీజేపీ కోసం బ్యాటింగ్ చేస్తున్నారని కేజ్రీవాల్ సుప్రీంకోర్టు ఎదుట విమర్శించారు. ఆ తరువాత విలేకరుల సమావేశంలో, ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించేందుకు అనుమతించాలని కోరుతూ ఎల్జీ రాష్ట్రపతికి రాసిన లేఖ ప్రతిని ఆయన అందించారు. బుధవారం ఉదయం తొమ్మిదిన్నరకు తాము లెఫ్టినెంట్ గవర్నర్ను కలిసి తమ స్టింగ్ సాక్షి, న్యూఢిల్లీ:
అక్రమ మార్గాల ద్వారా ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీని అడ్డుకునేందుకు తాము అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. కాషాయ పార్టీని నిలువరించేందుకు కాంగ్రెస్, జనతాదళ్ (యు) పార్టీలతో పాటు బీజేపీలోని కొంతమంది నిజాయితీపరులైన ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో చెప్పారు. తమ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందని, అవసరమైన పక్షంలో మరిన్ని టేపులు బయటపెడతామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఓ స్టింగ్ ఆపరేషన్కు సంబంధించిన వీడియో కేజ్రీవాల్ సోమవారం బయటపెట్టిన సంగతి తెల్సిందే. బీజేపీ ఢిల్లీ శాఖ ఉపాధ్యక్షుడు షేర్సింగ్ డాగర్ సంగం విహార్ నియోజకవర్గ ఆప్ ఎమ్మెల్యే దినేష్ మొహనియాకు లంచం ఇవ్వజూపిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. తాము అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. స్వతంత్ర అభ్యర్థి రాంబీర్ షోకీన్ (ముండ్కా), జేడీ(యూ) ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్, ఆప్ బహిష్కృత సభ్యుడు వినోద్కుమార్ బిన్నీతో పాటు కాంగ్రెస్, బీజేపీలోని నిజాయితీపరులైన ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నామని తెలిపారు. తాము ప్రభుతాన్ని ఏర్పాటు చేయడానికే ఇవన్నీ చేయడం లేదని, కేవలం బీజేపీని అక్రమ మార్గాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు.
బీజేపీ కోసం ఎల్జీ తాపత్రయం
ప్రభుత్వం ఏర్పాటు కోసం సుప్రీంకోర్టు కేంద్రానికి నెల రోజుల గడువు ఇవ్వడంతో ఆమ్ ఆద్మీ పార్టీ కొంత నిరాశకు గురైంది. సుప్రీంకోర్టులో తమ పిటిషన్పై విచారణ వాయిదా పడడంతో ఆమ్ ఆద్మీ పార్టీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్పై ఆరోపణలు గుప్పించింది. న్యాయస్థానంపై తమకు నమ్మకం ఉంది కానీ లెప్టినెంట్ గవర్నర్పై లేదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. నజీబ్జంగ్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి ఆరోపించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు తగిన సంఖ్యాబలం లేదంటూ బీజేపీ డిసెంబర్లో లెప్టినెంట్ గవర్నర్కు రాసిన లేఖ ఇంకా ఆయన వద్దనే ఉందని చెప్పారు. బీజేపీ ఆ లేఖను ఉపసంహరించుకోలేదని, అటువంటప్పుడు ఎల్జీ ఏ ఆధారంతో బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలనుకుంటున్నారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఎల్జీ బీజేపీ కోసం బ్యాటింగ్ చేస్తున్నారని కేజ్రీవాల్ సుప్రీంకోర్టు ఎదుట విమర్శించారు. ఆ తరువాత విలేకరుల సమావేశంలో, ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించేందుకు అనుమతించాలని కోరుతూ ఎల్జీ రాష్ట్రపతికి రాసిన లేఖ ప్రతిని ఆయన అందించారు. బుధవారం ఉదయం తొమ్మిదిన్నరకు తాము లెఫ్టినెంట్ గవర్నర్ను కలిసి తమ స్టింగ్ ఠ5వ పేజీ తరువాయి
ఆపరేషన్ సీడీని సమర్పించనున్నట్లు చెప్పారు. సీడీ చూసిన తరువాత ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి ఆహ్వానించకూడదంటూ ఎల్జీ తన లేఖలో సవరణలు చేయాలని ఆయన సూచించారు. స్టింగ్ ఆపరేషన్ సీడీని తాము రాష్ట్రపతికి కూడా పంపుతామని ఆయన చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా తాము ఉద్యమం లేవదీస్తామని, సీడీని ప్రజలకు చూపించి బీజేపీ ద్వంద్వైవె ఖరిని ప్రజల ముందుంచుతామని ఆయన చెప్పారు.
ఎన్నికలలలో పోటీచేసి సత్తా చూపాలని బీజేపీకి సవాలు విసిరారు. కేంద్రంలో సర్కారు ఏర్పాటుచేసి, ఢిల్లీలో ఏడింటికి ఏడు స్థానాలు గెలిచిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేసేందకు ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు. ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం లేదని, మళ్లీ ఎన్నికలు జరగాలని కోరుతోందని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపైనే పూర్తిగా దృష్టిని కేంద్రీకరించాలని నిర్ణయించిన ఆప్ రాజధాని నగరంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే ప్రజలకు మరింత దూరమవుతానని ఆందోళన చెందుతోంది.
చేయి విడువలేదు..
Published Tue, Sep 9 2014 11:42 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement