తిరువనంతపురం: 'నేను మళ్లీ పోలీసు కేసు పెట్టాలనుకోవడం లేదు. నాపై జరిగిన అత్యాచారం కంటే పోలీసుల వేధింపులే దారుణంగా ఉన్నాయి. పోలీసుల బెదిరింపులు, వేధింపులు తట్టులేకోపోతున్నాం'.. ఇదీ కేరళలో సామూహిక అత్యారానికి గురైన 35 ఏళ్ల మహిళ ఆవేదన. న్యాయం కోసం తమను ఆశ్రయించిన అత్యాచార బాధితురాలికి కేరళ పోలీసులు మూడు నెలల పాటు నరకం చూపించారు. పిచ్చి ప్రశ్నలతో ఆమెను వేధించి, ఒత్తిడి పెంచి కేసు ఉపసంహరించుకునేలా చేశారు.
ఈ అభాగ్యురాలి కన్నీటి గాథను ప్రముఖ డబ్బింగ్ కళాకారిణి భాగ్యలక్ష్మి ఫేస్ బుక్ ద్వారా వెలుగులోకి తెచ్చారు. ఈ ఏడాది ఆరంభంలో త్రిశూర్ లో బాధితురాలిపై ఆమె భర్త స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి భర్త ఆస్పత్రిలో ఉన్నాడని నమ్మబలికి ఇంట్లోంచి ఆమెను బయటకు తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. నలుగురు నిందితుల్లో ఒకరు రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్నట్టు భాగ్యలక్ష్మి వెల్లడించారు. భర్తతో కలిసి బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల వేధింపులు తట్టుకోలేక బాధితురాలు కేసు వెనక్కి తీసుకుంది.
ఫేస్ బుక్ లో పెట్టిన భాగ్యలక్ష్మి పోస్టు విపరీతంగా షేర్ కావడంతో విషయం ముఖ్యమంత్రి పినరయి విజయన్ దృష్టికి వెళ్లింది. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సీఎం కార్యాలయం హామీయిచ్చింది. కాగా, బాధితురాలు, ఆమె భర్త ముసుగులు ధరించి గురువారం మీడియా ముందుకు వచ్చారు. పోలీసులు తమను ఏవిధంగా వేధించారో వివరించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రేప్ బాధితురాలికి నరకం చూపించిన ఖాకీలు
Published Fri, Nov 4 2016 8:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement