దంపతులపై దుండగుల దాడి: భర్త మృతి | Sakshi
Sakshi News home page

దంపతులపై దుండగుల దాడి: భర్త మృతి

Published Sun, Mar 13 2016 7:11 PM

Couple attacked by unidentified men in Udumalaipettai

తమిళనాడు: ఎనిమిది నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్న దంపతులపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఈ ఘటన తమిళనాడులోని ఉడుమాలయిపెట్టాయిలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ దాడిలో భర్త తీవ్రగాయాలతో అక్కడిక్కడికే మృతిచెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది.

దాంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement