న్యూఢిల్లీ: చేయని నేరానికి కోర్టు మార్షల్కు గురై గత ఇరవై ఆరేళ్లుగా విధులకు దూరంగా ఉంటున్న ఓ సైనికుడి(సెకండ్ లెఫ్టినెంట్ కల్నల్)కి న్యాయం జరిగింది. చివరికి అతడిని వెంటనే విధుల్లోకి తీసుకోవడమే కాకుండా ఈ కాలం నాటికి అతడు ఏఏ ర్యాంకులు పొందాలో అవన్నీ ఇచ్చి, రూ.4కోట్లు అతడికి చెల్లించాలంటూ జస్టిస్ డీపీ సింగ్, ఎయిర్ మార్షల్ అనిల్ చోప్రా ధర్మాసనం తీర్పు చెప్పింది. శ్రీనగర్లోని రాజపుట్ ఆరో బెటాలియన్లో 1991నాటికి ఎస్ఎస్ చౌహాన్ అనే వ్యక్తి సెకండ్ లెఫ్టినెంట్ అధికారిగా విధులు నిర్వర్తించేవారు.
అయితే, అతడిని పలాయనం చెందిన సైనికుడిగా, మానసిక స్థితి సరిగా లేని వ్యక్తిగా పేర్కొంటూ 1991 నవంబర్ 4న అతడిపై కోర్టు మార్షల్ విధించగా నాటి శ్రీనగర్లోని జనరల్ ఆఫిసర్ ఇన్ కమాండింగ్ చీఫ్ కూడా ఆమోదించారు. దీంతో అప్పటి నుంచి ఆయన తిరిగి తన స్థానాన్ని పొందేందుకు కోర్టును ఆశ్రయిస్తునే ఉన్నారు. అతడు కోర్టుకు చెప్పిన ప్రకారం 1990 ఏప్రిల్ 11న శ్రీనగర్లోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించే క్రమంలో చౌహాన్ 147 బంగార్లు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు.
వీటి బరువు దాదాపు 27.5 కేజీల వరకు ఉంటుంది. వీటిని తన పై అధికారులు కల్నల్ కేఆర్ఎస్ పవార్, లెఫ్టినెంట్ జనరల్ జాకి మహ్మద్ అహ్మద్లకు అప్పగించారు. అయితే, వాటిని పై అధికారులే కాజేసినట్లు తెలిసింది. ఈ విషయంలో తీవ్ర అనుమానాలు రేపి చివరకు చౌహాన్కు కోర్టు మార్షల్ విధించేలా చేశారు. దీనికి సంబంధించి నిజనిజాలు తెలుసుకున్న ది ఆర్మ్డ్ ఫోర్స్ ట్రిబ్యునల్ చివరకు చౌహాన్ నిర్దోషిగా తేల్చింది. రక్షణశాఖకు రూ.5కోట్ల ఫైన్ విధించింది. వాటిల్లో రూ.4 కోట్లు చౌహాన్కు, మరో కోటిని అతడి పేరిట ఆర్మీ సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్ కింద నాలుగు నెలల్లో జమ చేయాలని తీర్పునిచ్చింది. బంగారు బిస్కెట్లు వ్యవహారం తేల్చాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
26 ఏళ్లకు విముక్తి.. డిఫెన్స్కు రూ.5కోట్ల ఫైన్
Published Fri, Jan 20 2017 1:28 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
Advertisement