‘అది గూండాల రాష్ర్టం’ | Sakshi
Sakshi News home page

‘అది గూండాల రాష్ర్టం’

Published Thu, Sep 14 2017 8:31 PM

‘అది గూండాల రాష్ర్టం’ - Sakshi

సాక్షి,న్యూఢిల్లీః కేరళను పాలక సీపీఎం గూండాల ప్రదేశంగా మార్చిందని బీజేపీ ఆరోపించింది. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలపై రాష్ర్ట ప్రభుత్వం హత్యాకాండకు తెగబడుతోందని ఆ పార్టీ నేత సంబిత్‌ పాత్రా పేర్కొన్నారు. కమ్యూనిస్టులు తమ సిద్ధాంతం కోసం కేరళ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించడంతో పాటు దేశాన్ని విభజిస్తున్నారని విమర్శించారు. 
 
సాంస్కృతిక వైభవం, చరిత్ర కలిగిన కేరళ వామపక్షాల నేతృత్వంలో మసకబారిందని ఆరోపించారు. జాతీయవాదులపై కేరళ ప్రభుత్వం హింసను ప్రేరేపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేరళలో హింసకు సీఎం విజయన్‌ కారకులని, సీపీఐ సిద్ధాంత భాగస్వామిగా కాంగ్రెస్‌ మారిందన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement