Sakshi News home page

'పనికిమాలిన ప్యాకేజీ ఇచ్చారు'

Published Sun, Oct 16 2016 6:09 PM

'పనికిమాలిన ప్యాకేజీ ఇచ్చారు' - Sakshi

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు భూమి పిచ్చి పట్టుకుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రైతుల నుంచి 10 లక్షల ఎకరాల భూమి సేకరిస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు రైతులను ముంచుతున్నారని దుయ్యబట్టారు. భూసేకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు.

మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ను జనావాసాలు లేని ప్రాంతంలో పెట్టాలని సూచించారు. ప్రత్యేక హోదాపై ఏపీ ప్రజలను బీజేపీ మోసం చేసిందన్నారు. పనికిమాలిన ప్యాకేజీ ఇచ్చారని మండిపడ్డారు. బీజేపీకి దమ్ముంటే ఏపీలోని నలుగురు ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించి, ప్యాకేజీతో సంతృప్తి చెందామని నిరూపించాలని రామకృష్ణ సవాల్ చేశారు. ఎన్నికల హామీని బీజేపీలో తుంగలో తొక్కిందని, దీనిపై కొర్టులో పిల్ వేస్తామని తెలిపారు.

Advertisement
Advertisement