బొగ్గు క్షేత్రం కేటాయింపుల్లో అవకతవకలపై విచారణ హిందాల్కోకు లబ్ధి చేకూర్చడంపై ప్రశ్నలు
త్వరలో బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పరేఖ్కూ సమన్లు
కుమార మంగళం బిర్లానూ ప్రశ్నించే అవకాశం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు క్షేత్రాల కేటాయింపు కుంభకోణంలో ప్రమేయంపై బొగ్గుశాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావును సీబీఐ అధికారులు సోమవారం ప్రశ్నించారు. ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయానికి దాసరిని సమన్లు జారీ చేసి రప్పించిన అధికారులు... ఒడిశాలోని తాలబిరా-2 బొగ్గు క్షేత్రం కేటాయింపుల్లో అవకతవకలపై విచారించారు. 2005లో తాలబిరా-2 క్షేత్రాన్ని ప్రభుత్వరంగ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్కు కేటాయిస్తూ బొగ్గుశాఖలోని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నా అందుకు విరుద్ధంగా నైవేలీతోపాటు హిందాల్కోకు ఆ క్షేత్రాన్ని కేటాయించడంపై ఆయన్ను ప్రశ్నించారు. దాసరి 2004 నుంచి 2006 వరకూ తొలిసారి, 2006 నుంచి 2008 వరకూ రెండోసారి బొగ్గుశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆయన 2000 సంవత్సరం నుంచి 2012 వరకూ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. సీబీఐ విచారణ అనంతరం ఆయన స్పందన తెలుసుకునేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు.
బొగ్గుశాఖలో సంస్కరణలు బుట్టదాఖలు కావడానికి దాసరి, నాటి బొగ్గుశాఖ మంత్రి శిబూ సోరెన్ బాధ్యులంటూ బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పి.సి. పరేఖ్ ఈ కుంభకోణంపై రాసిన పుస్తకంలో ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లాతోపాటు పరేఖ్ను నిందితులుగా పేర్కొంటూ గత ఏడాది కేసులు నమోదు చేసిన సీబీఐ ఈ వారంలో పరేఖ్ను విచారించే అవకాశం ఉంది. బిర్లా గ్రూప్లోని ఉన్నత స్థాయి అధికారులను సీబీఐ ఇప్పటికే ప్రశ్నించినా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లాకు సమన్ల జారీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. బొగ్గు కుంభకోణంలో ప్రత్యేకించి తాలబిరా-2 క్షేత్రం కేటాయింపులపై ప్రధాని మన్మోహన్సింగ్ సలహాదారు టి.కె.ఎ. నాయర్ నుంచి లిఖితపూర్వక సమాధానాలు తీసుకున్నప్పటి నుంచి సీబీఐ ఈ కేసు దర్యాప్తులో వేగం పెంచింది. ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేశాక కేసు ముగింపు నివేదిక లేక చార్జిషీట్ దాఖలుపై సీబీఐ నిర్ణయం తీసుకుంటుందని ఆ వర్గాలు వివరించాయి.
ఆధారాల్లేక రెండు కేసుల మూసివేత
ఛత్తీస్గఢ్లోని బొగ్గు క్షేత్రాలను అడ్డదారిలో పొందారన్న ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ విజయ్ దర్దా, ఆయనకు చెందిన జేఎల్డీ యావత్మాల్ ఎనర్జీ లిమిటెడ్పై 2012లో నమోదు చేసిన కేసును సీబీఐ సరైన ఆధారాల్లేక మూసేసింది. అలాగే దర్దా కుటుంబానికి సన్నిహితుడైన నాగ్పూర్ వ్యాపారవేత్త మనోజ్ జయస్వాల్కు చెందిన జేఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పవర్ లిమిటెడ్పై నమోదు చేసిన కేసులోనూ క్విడ్ప్రోకోను నిరూపించేందుకు ఆధారాల్లేక కేసును మూసేసింది. ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో కేసుల మూసివేత కోరుతూ నివేదిక సమర్పించింది.
దాసరిని ప్రశ్నించిన సీబీఐ
Published Tue, Apr 22 2014 4:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement