సీఐసీగా దీపక్ సంధూ బాధ్యతల స్వీకారం | Sakshi
Sakshi News home page

సీఐసీగా దీపక్ సంధూ బాధ్యతల స్వీకారం

Published Fri, Sep 6 2013 6:05 AM

సీఐసీగా దీపక్ సంధూ బాధ్యతల స్వీకారం

న్యూఢిల్లీ: భారత ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా దీపక్ సంధూ బాధ్యతలు చేపట్టారు. ఒక మహిళ ఈ పదవిని చేపట్టడం ఇదే తొలిసారి. గురువారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. సంధూతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తదితరులు హాజరయ్యారు. 64 ఏళ్ల సంధూ 1971 బ్యాచ్‌కు చెందిన ఐఐఎస్ అధికారి. ఆమె గత నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వ సమాచార కమిషనర్‌గా పని చేస్తున్నారు.

Advertisement
Advertisement