కేంద్రం, ఆర్బీఐలకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం
నాణాలపై మతచిహ్నాల ముద్రణపై వివరణ ఇవ్వాలని నిర్దేశం
న్యూఢిల్లీ: హిందూ, ముస్లిం, క్రైస్తవం సహా ఏ మతాన్నీ ప్రోత్సహించినట్లుగా, ప్రచారం చేస్తున్నట్లుగా ప్రభుత్వం వ్యవహరించొద్దని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. అసలు లౌకికత్వం అనే దానికి సరైన వివరణ ఇవ్వాల్సి ఉందని పేర్కొంది. కరెన్సీ నాణాలపై మతానికి సంబంధించిన చిహ్నాలు, చిత్రాలను ముద్రించడంపై మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్ర ఆర్థికశాఖ, రిజర్వు బ్యాంకులను ఆదేశించింది.
తాంజావూరులోని బృహదీశ్వరాలయం నిర్మించి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా 2010లో ప్రభుత్వం.. ఆ ఆలయం చిత్రంతో ఐదు రూపాయల నాణాన్ని విడుదల చేసింది. అలాగే, వైష్ణోదేవి ఆలయ బోర్డుకు సంబంధించిన బొమ్మతో 2013లో రిజర్వుబ్యాంకు ఐదు రూపాయల నాణాన్ని విడుదల చేసింది.
దీనిని ప్రశ్నిస్తూ.. ఢిల్లీకి చెందిన నఫీస్ ఖాజీ, అబు సయీద్ ఢిల్లీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. నాణాలపై మతానికి చెందిన చిహ్నాలు, చిత్రాలు రాజ్యాంగ మూల సూత్రమైన లౌకికతత్వానికి విఘాతం కలిగిస్తాయని.. ఆ నాణాలను ఉపసంహరించుకునేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
దేశానికి (ప్రభుత్వానికి) చెందిన స్థిర, చరాస్తులు వేటిపైనా మతాలకు సంబంధించిన చిహ్నాలను ముద్రించకుండా, వినియోగించకుండా... ఒక జాతీయ పాలసీని రూపొందించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
ఈ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బీడీ అహ్మద్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారించింది.
తదుపరి విచారణను ఏప్రిల్ 23కు వాయిదా వేసింది.
ఏ మతానికీ ప్రచారం చేయొద్దు
Published Thu, Mar 20 2014 2:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement