ఢిల్లీ హైకోర్టులో పిల్
న్యూఢిల్లీ: ఎన్నికల తర్వాత రాజకీయపార్టీలు అధికారం దక్కించుకునేందుకోసం కూటమిగా ఏర్పడడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై ఢిల్లీ హైకోర్టు బుధవారం తన తీర్పును రిజర్వు చేసింది. న్యాయవాది మిథిలేష్ కుమార్ పాండే ఈ పిల్ను దాఖలు చేశారు. రాజకీయ పార్టీలు ఎన్నికల అనంతరం కూటమిగా ఏర్పడడం సరికాదని, ఇలా చేయడం ఓటేసే సమయంలో ఓటర్లను ఏమీ తెలియకుండా చీకట్లో ఉంచడమే అవుతుందని వాదించారు. ఈ పిటిషన్ను జస్టిస్ జి.రోహిణి, జస్టిస్ రాజీవ్ సహాయ్ ఎండ్లాలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. దీనిపై తగిన ఉత్తర్వులను వెలువరిస్తామని ధర్మాసనం పేర్కొంది. ఎన్నికల్లో ఒక రాజకీయపార్టీపై పోటీ పడిన మరో పార్టీ ఎన్నికల అనంతరం అదే పార్టీతో కూటమి ఏర్పాటు చేయడం రాజ్యాంగ వ్యతిరేక చర్యగా ప్రకటిస్తూ ఆదేశాలివ్వాలని పాండే తన పిటిషన్లో కోర్టును అభ్యర్థించారు. అదేవిధంగా తమ ఎన్నికల మేనిఫెస్టోను తామే ఉల్లంఘిస్తూ రాజకీయపార్టీలు ఎన్నికల తరువాత అధికారం కోసం కూటమిగా ఏర్పాటవకుండా నిరోధించేలా, ఎన్నికల మేనిఫెస్టోను చట్టపరంగా ఆచరించే పత్రంగా చేసేలా ఆదేశాలివ్వాలన్నారు. అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) సంజయ్ జైన్ మాట్లాడుతూ.. దేశంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు, ఆయా సందర్భాల్లో ప్రభుత్వ ఏర్పాటుకోసం వివిధ పార్టీలన్నీ కలసి కూటమిగా ఏర్పడడం జరుగుతున్నదని వివరించారు. ఒకే పార్టీ పూర్తి మెజారిటీ సాధించే దాకా పదేపదే ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడదన్నారు.
ఎన్నికల తర్వాత కూటములు సరికాదు
Published Thu, Sep 11 2014 12:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
No Headline
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వస్తే బాబు భూ కుంభకోణాలన్నీ బట్టబయలు
వ్యక్తికి తీవ్ర గాయాలు
ఓటు హక్కు వినియోగం అందరి బాధ్యత
కత్తితో దాడిచేసి.. ఆస్పత్రిలో చేర్పించి..!
వైఎస్సార్సీపీ వెంటే యాదవులు
ఘనంగా ఆదిత్యుని కల్యాణం
పార్టీని వీడిన కీలక నేతలు..
జగనన్నతోనే సంక్షేమాభివృద్ధి
జిల్లాలో 18,631 పోస్టల్ బ్యాలెట్లు
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement