రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

Published Mon, Sep 26 2016 8:51 AM

Delhi Traffic Constable Run Over By Truck, Driver Arrested

న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ను వేగంగా వచ్చిన లారీ  ఢీకొట్టింది. దీంతో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. అశోక్ విహార్లో మోటార్ బైక్ పై విధి నిర్వహణలో ఉన్న రవీందర్ ను వెనక నుంచి వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. హర్యానాకు చెందిన ప్రమోద్ సింగ్ వాహనాన్ని నడుపుతున్నారు. డ్రైవర్ ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement