పాటియాలా: రియో ఒలింపిక్స్ లో మహిళలు పతకాలు సాధిస్తూ దేశానికి గర్వంగా నిలుస్తున్న వేళ ఓ జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ క్రీడాకారిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పంజాబ్ లోని పాటియాలాలో శనివారం చోటు చేసుకుంది. పాటియాలా లోని ఖల్సా కళాశాలలో పూజ (20) ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె గతేడాది కళాశాలలో అడ్మీషన్ తీసుకుంది. కాలేజీలోచేరే సమయంలో ఉచితంగా హాస్టల్ సౌకర్యం కల్పిస్తామని కళాశాల యాజమాన్యం హామీ ఇచ్చారు.
ఆమె ఇంటినుంచి కాలేజీకి రావడానికి రోజూ రూ.120 ఖర్చు అవుతుంది.కూరగాయలు అమ్మి కుటుంబాన్ని పోషించే తండ్రి ఖర్చులు భరించలేనని చదువు మానేయాల్సిందిగా పూజాకు సూచించాడు దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పూజ నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్రమోదీగారూ నాలాంటి పేద విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్సించడి అని రాసింది. కళాశాల లో హాస్టల్ వసతి ఇవ్వనందుకే బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. కేసును నమోదు చేసిన పోలీసులు కేసును విచారిస్తున్నారు.
జాతీయ స్థాయి క్రీడాకారిణి ఆత్మహత్య
Published Sun, Aug 21 2016 10:56 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- ఇంటికి 100 మీటర్ల దూరంలో.. 26 ఏళ్ల పాటు చెరలో
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- బీపీతో హార్ట్ఎటాక్
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
- మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా?
Advertisement