ముంబై : లైంగిక నేరాలను అదుపు చేయడానికి మహా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదు, ఇలాంటి కేసులను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత గుర్తిస్తోందని సీనియర్ అధికారి పేర్కొన్నారు. లైంగిక నేరాల అదుపు చేయడంలో భాగం గా రాష్ట్ర బాలల అభివృద్ధి విభాగం, బాలల హక్కు ల పరిరక్షణ కమిషన్, యూనిసెఫ్ సంయుక్తంగా బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడకుండా నిరోధించే పోక్సో చట్టం(20012)పై ఆదివారం సాయంత్రం అవగాహన సదస్సును నిర్వహించింది.
రాష్ట్ర ప్రభుత్వం లైంగికనేరాలను జీరోస్థాయికి తీసుకొని రావడమే ధ్యేయంగా ప్రకటించింది. చట్టంపై అవగాహనతోపాటు, లైంగిక నేరాల అదుపునకు అవసరమైన ప్రతిపాదనలు, సూచనలను రూపొం దించడం కోసం నిర్వహించిన ఈ సదస్సు చేసే తీర్మానాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని అమలు చేయాల ని నిర్ణయించిందని సీనియర్ అధికారి తెలిపారు. మహిళా-బాలికల అభివృద్ధి విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ ఉజ్వల్ ఉకే ఈ సదస్సులో మాట్లాడుతూ బాలికలపై నేరాలకు పాల్పడే కేసుల పట్ల ప్రభుత్వం తక్షణమే స్పందిస్తూ చర్యలు తీసుకొంటుందని చెప్పారు. పోక్సో చట్టం పట్ల అత్యధిక ప్రజల్లో అవగాహన లేదని, అందుకే చట్టం దుర్వినియోగం అవుతోందని, నేరస్తులు సులువుగా తప్పించుకొంటున్నారని చెప్పారు.
గత ఐదేళ్లకాలంలో బాలిక పట్ల లైంగిక నేరాల కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయని, దీనికి కారణం చట్టం పట్ల అవగాహన లేకపోవడమే కారణమని అన్నారు. బాలికలకు జరిగిన ఘోరాన్ని చెప్పుకోవడం కత్తిమీదసాములా మారిందని, ఇది నిందితులకు అవకాశంగా మారుతోందని అన్నారు. ఈ చట్టం కింది నిందితులకు సరైన శిక్ష పడుతుందని తల్లిదండ్రులు తెసుకోవాలని, తద్వారా నిందితులపై ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలని సూచించారు. అత్యధిక సంఖ్యలో ప్రజల్ని ఈ చట్టం పట్ల చైత్యన్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని, దీని ద్వారా నిందితులను శిక్షించే అవకాశం ఉంటుందని అన్నారు.
బాధితులు సహకరిస్తేనే బాలికలపై లైంగిక నేరాల సంఖ్య తగ్గుతుందని అన్నారు. చారిటబుల్ ఆర్గనైజేషన్ల ద్వారా బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడేవారికి వ్యతిరేకంగా గళం వినిపించాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఈ సదస్సులో ప్రముఖ న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, బాలనేరస్తుల న్యాయవిభా గం జస్టిస్, బాలికల సంక్షేమ కమిటీల స భ్యులు అభిప్రాయాలను వెల్లడించారు. బాలికలపై లైంగిక నేరాలను సహించవద్దని ముక్తకంఠంగా తీర్మానించారు.
బాలికలపై లైంగిక నేరాలను ఉపేక్షించేదిలేదు
Published Sun, Aug 10 2014 10:49 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement