కోర్టుకు హాజరైన కరుణానిధి | Sakshi
Sakshi News home page

కోర్టుకు హాజరైన కరుణానిధి

Published Mon, Jan 18 2016 10:51 AM

కోర్టుకు హాజరైన కరుణానిధి

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి (92) సోమవారం చెన్నై కోర్టుకు హాజరయ్యారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆయన కోర్టుకు వచ్చారు. కరుణానిధి వెంట ఆయన కూతురు కనిమొళి, చిన్న కొడుకు స్టాలిన్ ఉన్నారు.

ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు ఈ కేసు విచారణను మార్చి 10 వ తేదీకి వాయిదా వేసింది. డీఎంకే మేగజైన్లో ప్రచురించిన ఓ వ్యాసంలో తన పరువుకు భంగం కలిగేలా రాశారని ఆరోపిస్తూ గతేడాది జయలలిత పరువు నష్టం దావా వేశారు. కాగా జయ ఆరోపణలను కరుణానిధి ఖండించారు.
 

Advertisement
Advertisement