* ముల్లైపెరియార్పై సభలో చర్చ
* విజయం మాదంటే మాదేనన్న పార్టీలు
* ఇది తమిళుల విజయం: జయలలిత
చెన్నై, సాక్షి ప్రతినిధి: ముల్లైపెరియార్ విజయంపై శుక్రవారం అసెంబ్లీ అట్టుడికి పోయింది. ఈ విజయం తమదంటే తమదేనని అధికార, ప్రతిపక్ష పార్టీలు రచ్చకెక్కాయి. ముందుగా ముఖ్యమంత్రి జయలలిత మాట్లాడుతూ తమ ప్రభుత్వం చిత్తశుద్ధి, నిజాయితీ, నిబద్ధత వల్లే ముల్లైపెరియార్ను సాధించుకున్నామన్నారు. ఇది పూర్తిగా తమిళ ప్రజల విజయమని చెప్పారు. ముఖ్యంగా వ్యవసాయదారుల కల ఫలించిందని తెలిపారు. తేనీ, మదురై, శివగంగై, రామనాథపురం, దిండుగల్లు జిల్లాల్లోని వేలాదిమంది రైతులకు లబ్ధిచేకూరుతుందని ఆమె హర్షం వ్యక్తం చేశారు.
2002 వరకు చెన్నై హైకోర్టు పరిధిలో ఉన్న వివాదం ముల్లైపెరియార్ ఆ తరువాత సుప్రీం కోర్టుకు చేరి ఎట్టకేలకు చారిత్రాత్మక న్యాయం చేకూరిందని అన్నారు. 142 అడుగుల ఎత్తు పెంపుపై మే 7వ తేదీన సుప్రీంకోర్టు తీర్పుచెప్పినా కేరళ ప్రభుత్వం అమలుకు నిరాకరించి నేడు భంగపడిందని అన్నారు. అనంతరం డీఎంకే సభ్యులు దురైమురుగన్ మాట్లాడుతూ ముల్లైపెరియార్పై వచ్చిన తీర్పు అందరికీ ఆనందకరమేనన్నారు. అయితే ఈ విజయం ఏ ఒక్కరి సొంతం కాదని అన్నారు. ఇందుకు అన్నాడీఎంకే సభ్యులు అభ్యంతరం తెలుపుతూ కేకలు వేశారు. డీఎంకే అధినేత కరుణానిధి, తమిళ ప్రజలు, ముఖ్యంగా ఐదు జిల్లాల రైతులు ఆందోళనలు నిర్వహించిన ఫలితమే నేటి విజయమని అన్నారు.
దురైమురుగన్ మాటలను అన్నాడీఎంకే నేతలు అడ్డుకోగా, స్పీకర్ సైతం వారినే సమర్థించడంతో నిరసనగా డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. ఇంతలో డీఎండీకే సభ్యులు మోహన్రాజ్ మాట్లాడుతూ ముల్లైపెరియార్ సాధనలో తమ పార్టీ అధినేత కెప్టెన్ సాగించిన పోరాటం కూడా ఉందని అన్నారు. ఈ మాటలపై అన్నాడీఎంకే సభ్యులు పెద్దగా కేకలు వేస్తూ గట్టిగా నవ్వారు. దీన్ని అవమానంగా భావించిన డీఎం డీకే సభ్యులు అధికార పక్ష సభ్యులతో వాగ్వాదానికి దిగారు. వారిని శాంతిపజేసే ప్రయత్నంగా మంత్రి ఓ పన్నీర్ సెల్వం లేచినిలబడ్డారు. ముల్లైపెరియార్ కోసం కెప్టెన్ ఎలా పోరాడారని ఊహించుకుంటే తమ సభ్యులకు నవ్వువచ్చిం దని వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలు మరిం త అవమానకరమని పేర్కొంటూ డీఎండీకే సభ్యు లు వాకౌట్ చేశారు.
విచారణ అనంతరం చర్యలు : జయ
కొడంగయ్యూర్ పోలీస్ స్టేషన్లో విచారణ ఖైదీ గోపాల్ మరణించిన సంఘటనపై విచారణ పూర్తయిన తరువాత నిందితులపై చర్యతీసుకుంటామని అసెంబ్లీలో సీఎం జయ హామీ ఇచ్చారు. ఈనెల 15వ తేదీ గోపాల్ను పోలీసులు తీసుకువచ్చారు. 16వ తేదీ ఉదయం కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకురాగా పోలీస్స్టేషన్ వాకిట్లోనే ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
విజయంపై వాదులాట
Published Sat, Jul 19 2014 12:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement