ప్రాణం తీసిన డాక్టర్ల క్రికెట్ పిచ్చి | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన డాక్టర్ల క్రికెట్ పిచ్చి

Published Sun, Apr 3 2016 1:30 AM

Doctor's Cricket mad

మథుర: ఆ డాక్టర్ల క్రికెట్ దురభిమానం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని మథురలో గురువారం ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ సోను అనే వ్యక్తిని దారినపోయేవాళ్లు దగ్గర్లోని రవి ఆస్పత్రిలో చేర్పించారు.

ఇండియా- వెస్టిండీస్ మ్యాచ్ రసవత్తరంగా ఉండడంతో ఆ మైకంలో వైద్యులు సోనుకు చికిత్స చేయడం మర్చిపోయారు. నర్సులు ప్రాథమిక చికిత్స చేసి మత్తు మందు ఇచ్చి అలా వదిలేశారు.  సరైన వైద్యం అందకపోవడంతో శుక్రవారం సోను మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి  ఇవ్వబోమని కుటుంబసభ్యులు ఆందోళన నిర్వహించారు.

Advertisement
Advertisement