భారత్-నేపాల్ సరిహద్దుల్లో భూ ప్రకంపనలు | Sakshi
Sakshi News home page

భారత్-నేపాల్ సరిహద్దుల్లో భూ ప్రకంపనలు

Published Thu, Dec 1 2016 11:30 PM

భారత్-నేపాల్ సరిహద్దుల్లో భూ ప్రకంపనలు

భారత్-నేపాల్ సరిహద్దుల్లో గురువారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.2గా నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా చంపావత్, నగర్ గర్హ్‌వాల్, అల్మోరా ప్రాంతాల్లో ఎక్కువగా ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు చెప్పారు.

భూ ప్రకంపనలు రావడంతో ఆందోళనకు గురైన ఆ ప్రాంతాల ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటివరకైతే ఎలాంటి ముప్పు వాటిల్లలేదని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement