సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షహీన్బాగ్కు బిర్యానీలు సరఫరా చేస్తున్నారంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ చేసిన వ్యాఖ్యలకు గాను ఈసీ గురువారం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఓవైపు ప్రధాని నరేంద్ర మోదీ జాతీయవాదం, అభివృద్ధి కోసం పనిచేస్తుంటే మరోవైపు కాంగ్రెస్, కేజ్రీవాల్ విభజిత శక్తులకు తోడ్పాటు అందిస్తున్నారని ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగి ఆదిత్యానాథ్ అన్నారు. ఉగ్రవాదంపై మోదీ సర్కార్ రాజీలేని పోరు జరుపుతుంటే షహీన్బాగ్ ఆందోళనలకు మద్దతిస్తూ నిరసనకారులకు బిర్యానీ తినిపిస్తున్నారని మండిపడ్డారు. యోగి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఈసీ ఈనెల 7 సాయంత్రం 5 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా 11న ఫలితాలను వెల్లడిస్తారు.
యోగి బిర్యానీ వ్యాఖ్యలపై ఈసీ సీరియస్
Published Thu, Feb 6 2020 7:41 PM
Related News by category
-
‘ఇంధన’ సంస్కరణల్లో ఏపీ నవశకం..సరికొత్త కాంతులు
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో మునుపెన్నడూ ఎరుగని విప్లవాత్మక సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం–2020, ఏపీ పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ పాలసీ– 2022, ఏపీ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా పాలసీ– 2023లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్ర ప్రభుత్వ ఇంధన విధానాలపై ఆసక్తి చూపుతోంది. ప్రపంచ వేదికలపైనా ఏపీపై ప్రశంసలు కురుస్తున్నాయి. మరోవైపు పారిశ్రామిక దిగ్గజాలు సైతం విద్యుత్ రంగంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే పట్టాలెక్కిన పలు ప్రాజెక్టులు..విద్యుత్ ఉత్పత్తి సంస్థ (డిస్కం)లపై భారం పడకుండా, ఇతర రాష్ట్రాలకు విద్యుత్ను ఎగుమతి చేసేందుకు పునరుత్పాదక ఇంధన విద్యుత్ ప్రాజెక్టులను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన ఎగుమతి పాలసీ–2020ని నోటిఫై చేసింది. ఏపీ పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ పాలసీ–2022, ఏపీ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా పాలసీ–2023లను తీసుకొచ్చింది. వీటి ఫలితంగా విశాఖపట్నంలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో పంప్డ్ స్టోరేజ్ హైడ్రో, గ్రీన్ హైడ్రోజన్, బయోడీజిల్, కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్రాజెక్టుల పెట్టుబడి ప్రతిపాదనలపై పలు ఒప్పందాలు కుదిరాయి.ఓవైపు ప్రభుత్వ ప్రోత్సాహం, మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు రంగ పెట్టుబడులతో రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల స్థాపన శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే అనేక ప్రాజెక్టులు పట్టాలెక్కగా, మరికొన్నిటికి ప్రాజెక్టు నివేదికలు సిద్ధమవుతున్నాయి. 11,225 మెగావాట్ల సామర్థ్యం గల పవర్ ప్రాజెక్టు (8,025 మెగావాట్ల సౌర విద్యుత్, 3,200 మెగావాట్ల పవన విద్యుత్)లను ఇప్పటికే ప్రైవేట్కు కేటాయించారు. అలాగే ఏఎం గ్రీన్ ఎనర్జీ (ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్) 700 మెగావాట్ల సౌర విద్యుత్, 300 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్ట్లకు సంబంధించి పనులు పురోగతిలో ఉన్నాయి.మెరుగుపడుతున్న పంపిణీ సౌకర్యాలునంద్యాల, కర్నూలు జిల్లాల్లో 2,300 మెగావాట్ల సౌర విద్యుత్, 250 మెగావాట్ల పవన విద్యుత్కు సంబంధించి గ్రీన్కో గ్రూప్ సైట్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) మొదటి దశలో 4,500 మెగావాట్ల ఆర్ఈ పవర్, రెండో దశలో 9,000 మెగావాట్ల ఆర్ఈ పవర్ను తరలించడానికి నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం నందిపాడు వద్ద మౌలిక సదుపాయాలతో పాటు 765 కిలోవాట్స్(కేవీ) సబ్స్టేషన్ను నిర్మిస్తోంది. అలాగే 2 వేల మెగావాట్ల విద్యుత్ను తరలించడానికి అనంతపురం జిల్లాలోని గుంతకల్లో 400 కేవీ సబ్స్టేషన్ను నిరి్మంచాలని యోచిస్తోంది. 51 గిగావాట్ల ఆర్ఈ పవర్ (18 గిగావాట్ల పవన విద్యుత్, 33 గిగావాట్ల సౌర విద్యుత్)ను తరలించడానికి రాష్ట్రంలో పంపిణీ సౌకర్యాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచి్చంది. పీక్ పవర్ డిమాండ్ కోసం పీఎస్పీలు వేరియబుల్ రెన్యువబుల్ ఎనర్జీ (వీఆర్ఈ)ని సమతుల్యం చేయడానికి, పీక్ పవర్ డిమాండ్ను చేరుకోవడానికి ప్రభుత్వం పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టŠస్ (పీఎస్పీ)లను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే 32,400 మెగావాట్ల పీఎస్పీల ఏర్పాటుకు 29 సైట్ల కోసం టెక్నో కమర్షియల్ ఫీజిబిలిటీ రిపోర్ట్ (టీసీఎఫ్ఆర్)లను సిద్ధం చేసింది. మొత్తం 37 చోట్ల 42,270 మెగావాట్ల సామర్థ్యం గల పీఎస్పీల నిర్మాణానికి స్థలాలను ప్రభుత్వం గుర్తించింది. దశలవారీగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్), వివిధ అనుమతులను పొందడానికి మూడేళ్ల సమయం పడుతుంది.కాగా 16,180 మెగావాట్ల సామర్థ్యం గల పీఎస్పీ ప్రాజెక్టులను డెవలపర్లకు కేటాయించారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కరువు పీడిత ప్రాంతాల భూములను వాటి యజమానుల అంగీకారంతో స్థానిక రెవె న్యూ అధికారుల సహకారంలో సేకరించడానికి ఇప్పటికే చర్యలు మొదలయ్యాయి. గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఆంధ్రప్రదేశ్ మరోవైపు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం (హబ్)గా ఆంధ్రప్రదేశ్ అవతరించనుంది. తరిగిపోతున్న శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా, పెరుగుతున్న వాతావరణ కాలుష్యానికి విరుగుడుగా స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగంలోకి తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో రాష్ట్రం భాగమవుతోంది. ఈ ప్రాజెక్టు కోసం దేశం మొత్తం మీద ఐదు రాష్ట్రాలను కేంద్రం ఎంపిక చేయగా వాటిలో మన రాష్ట్రం కూడా ఉంది. దీనికనుగుణంగా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా పాలసీ–2023ని రాష్ట్రం రూపొందించింది. రాష్ట్రంలోని బళ్లారి–నెల్లూరు (కర్ణాటక–ఆంధ్రప్రదేశ్) మధ్య నేషనల్ గ్రీన్ స్టీల్, కెమికల్స్ కారిడార్గా తీర్చిదిద్దనున్నారు. ఈ కారిడార్లోని స్టీల్, కెమికల్ ప్లాంట్ల కోసం సంవత్సరానికి 5 వేల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ను 30 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ ప్లాంట్లో ఉత్పత్తి చేయనున్నారు. విశాఖపట్నంలో నేషనల్ గ్రీన్ రిఫైనరీ ట్రాన్స్పోర్ట్ హబ్ను సృష్టించి 20 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ ప్లాంట్తో సంవత్సరానికి 4 వేల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయనున్నారు. -
బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్రంలోని 1.40 కోట్లకుపైగా కుటుంబాలకు ఆపద్బాంధవి. దురదృష్టవశాత్తు ఏదైనా జబ్బు చేస్తే ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని కార్పొరేట్ ఆస్పత్రులకు వెళితే చేతి నుంచి రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా చికిత్స అందుతోంది. ఏదైనా శస్త్ర చికిత్స జరిగినా డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లాక విశ్రాంత సమయంలో సైతం ప్రభుత్వం ఆరోగ్య ఆసరా ద్వారా భృతి కూడా ఇస్తోంది. వెరసి పేద, మధ్య తరగతి కుటుంబాలకు కష్టకాలంలో ఈ పథకం కొండంత అండగా నిలుస్తోంది. ఇంతటి గొప్ప పథకంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శీతకన్ను వేశారు. నాడు వైఎస్సార్కు, నేడు సీఎం జగన్కు ఎంతో మంచి పేరు తెచ్చిన ఈ పథకాన్ని ఏదోరకంగా కనుమరుగు చేయాలని కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలో 2014–19 మధ్య ఈ పథకానికి పూర్తిగా ప్రాధాన్యం తగ్గించారు. ప్రొసీజర్లు, నెట్వర్క్ ఆస్పత్రుల సంఖ్యను పెంచకుండా అధికారం లోంచి దిగిపోయేనాటికి అంపశయ్య పైకి ఎక్కించారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ ఈ పథకానికి ఊపిరిలూదారు. దీంతో బాబుకు మింగుడు పడలేదు. ఇలా అయితే లాభం లేదనుకుని పెద్ద స్కెచ్చే వేశారు. బీమా పేరుతో మాయ చేసి, మేనిఫెస్టోలో ఆరోగ్యశ్రీ ప్రస్తావనే లేకుండా చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇటీవల టీడీపీ, జనసేన పారీ్టలు ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశాయి. వైద్యం, ఆరోగ్యం అంటూ నాలుగు అంశాలను పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగ్గా అమలు పరుస్తామని గానీ, పేద ప్రజలకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు (క్యాష్ లెస్ ట్రీట్మెంట్), రోగ నిర్ధారణ పరీక్షల సౌకర్యం కల్పిస్తామని ఎక్కడా ప్రస్తావించలేదు. దీన్నిబట్టి బాబు వస్తే ఆరోగ్యశ్రీ పథకం కనుమరుగవుతుందనడానికి టీడీపీ మేనిఫెస్టో ఒక సంకేతం అని రాజకీయ విశ్లేషకులు, వైద్య రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.రాష్ట్రంలో ప్రస్తుతం డాక్టర్ వైఎస్సార్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తోంది. ట్రస్ట్లో ఎంప్యానెల్డ్ అయిన ఆస్పత్రుల్లో పేదలు, మధ్యతరగతి కుటుంబాల వారు చేతి నుంచి నగదు చెల్లించకుండానే పూర్తి స్థాయిలో చికిత్సలు పొందుతున్నారు. కాగా, టీడీపీ తాజా హామీని గమనించినట్లయితే వాళ్లు అధికారంలోకి వస్తే.. ట్రస్ట్ స్థానంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఏజెన్సీలను ప్రవేశపెట్టనున్నారని ఇట్టే తెలుస్తోంది. ఇప్పటి వరకు ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభు త్వమే నేరుగా పథకాన్ని అమలు చేయడంతో ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు వైద్య సేవలు అందుతున్నా యి. అదే ఇన్సూరెన్స్ ఏజెన్సీల చేతుల్లోకి వెళితే వారి లాభాపేక్ష వల్ల ప్రజలకు వైద్య సేవల కల్పన ప్రశ్నార్థకంగా మారుతుందనడంలో సందేహమే లేదు. ట్రస్ట్ అయితే అందులో ఎంప్యానెల్డ్ అయిన ఆస్పత్రులు ఏ ప్రొసీజర్స్కు అయి నా నిర్ధే శించిన రేట్స్ ప్రకారమే వైద్య సేవలు అందిస్తాయి. అంతకు మించి ప్రజల నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడ్డానికి వీలుండదు. అలా వసూళ్లకు పాల్పడితే జిల్లా స్థాయిలో కలెక్టర్లు, రాష్ట్ర స్థాయిలో ట్రస్ట్ సీఈవో ఆధ్వర్యంలో ఆస్పత్రులపై చర్యలు తీసుకునే ఒక వ్యవస్థ ఉంటుంది. అదే ప్రైవే ట్ ఇన్సూరెన్స్ ఏజెన్సీలు వస్తే ఆస్పత్రులపై ప్రభుత్వ నియంత్రణ పోతుంది. ఇష్టారాజ్యంగా బిల్లులు వేసి ప్రజల నుంచి అదనపు వసూళ్లు చేస్తాయి. లేదంటే ఆస్పత్రి నుంచి బయటకు పంపించేస్తాయి. ఆరోగ్యశ్రీ ప్రస్తావనే లేని 2024 టీడీపీ మేనిఫెస్టో ∗ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వరకూ ఆరోగ్య బీమా ∗ ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డు ∗ అన్ని మండలాల్లో జనరిక్ ఔషధ కేంద్రాలు ∗ బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులకు జనరిక్ మందులు 2024 వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ∗ రాష్ట్రంలో ప్రారంభించిన ఐదు వైద్య కళాశాలలతో పాటు, మరో 12 కళాశాలల నిర్మాణం పూర్తి చేసి ఐదేళ్లలో అందుబాటులోకి తేవడం.తద్వారా 2,550 ఎంబీబీఎస్, 2,737 పీజీ మెడికల్ సీట్లు సమకూర్చడం.∗ కొత్తగా 17 నర్సింగ్ కాలేజీలు తేవడం ద్వారా అందుబాటులోకి 1,020 నర్సింగ్ సీట్లు. ∗ హృద్రోగ బాధితుల కోసం విశాఖ, గుంటూరు, కర్నూలులో మూడు వైద్య హబ్ల ఏర్పాటు. ∗ క్యాన్సర్ వైద్యాన్ని మరింత బలోపేతం చేసేలా గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్లు.∗ గడచిన ఐదేళ్లలో మాదిరిగానే వచ్చే ఐదేళ్లలోనూ ప్రజారోగ్య రంగానికి ఏ మాత్రం ప్రాధాన్యం తగ్గకుండా చర్యలు. వైద్య రంగ అభివృద్ధిని కొనసాగిస్తాం. పై రెండు మేనిఫెస్టోలు గమనిస్తే ప్రజారోగ్యం పట్ల ఏ నాయకుడికి ఎంత చిత్తశుద్ధి ఉందో స్పష్టంగా అర్థం అవుతుంది. మూడు సార్లు సీఎంగా పనిచేశా.. విజనరీనని చెప్పుకునే నాయకుడు ప్రజారోగ్యం పట్ల ఉజ్జాయింపుగా నాలుగంటే నాలుగే హామీలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. సీఎం జగన్ మాత్రం ప్రజారోగ్యం విషయంలో గడచిన ఐదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా ప్రజారోగ్యం విషయంలో రాజీ పడకుండా చర్యలు తీసుకున్నారు. ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచారు. ఆ ఒరవడిని అదే విధంగా కొనసాగిస్తూ వచ్చే ఐదేళ్లలోను ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తానని తన మేనిఫెస్టోలో ప్రకటించారు. సాక్షి, అమరావతి: వైద్య, విద్యా రంగాలను ప్రైవేట్ పరం చేయాలన్నది చంద్రబాబు లక్ష్యం. ఇందులో భాగంగానే తొలి నుంచీ ఆయన ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తూ వచ్చారు. 2014 ఎన్నికల సమయంలో ‘ఆరోగ్యశ్రీలో వ్యాధులన్నింటినీ చేర్చి, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత పరీక్షలు, చికిత్స, ఆపరేషన్ సౌకర్యం కల్పిస్తాం’ అని టీడీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక తూతూ మంత్రంగా ప్రొసీజర్లను పెంచి చేతులు దులుపుకున్నారు.2007లో వైఎస్సార్ హయాంలో 942 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి ప్రారంభిస్తే, చంద్రబాబు ప్రభుత్వం పథకాన్ని ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చి, కేవలం 117 వ్యాధులను మాత్రమే పెంచింది. అయినా వాటికి ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స సరిగా అందని దుస్థితి. వివిధ అనారోగ్య బాధితులకు చికిత్సలు అందించడానికి ఆస్పత్రుల నుంచి ట్రస్టుకు అభ్యర్థనలు వచ్చినా వాటిని రోజుల తరబడి పెండింగ్లో ఉంచేవారు.దీంతో చేసేదేమీ లేక చికిత్సలు చేయించుకోవడానికి ప్రజలు అప్పులపాలైన దుస్థితి. ఈ ఐదేళ్ల పాలనలో ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి, విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి సీఎం జగన్ ప్రజలకు అండగా నిలిచారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.5 లక్షల్లోపు వార్షికాదాయ కుటుంబాలను పథకం పరిధిలోకి తెచ్చి, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి రక్షగా నిలిచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.25 లక్షల వరకు వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు.1,059గా ఉన్న ప్రొసీజర్లను ఏకంగా 3,257కు పెంచారు. తద్వారా ఐదేళ్లలో 45.10 లక్షల మందికి ఉచిత చికిత్సల కోసం రూ.13,421 కోట్లు వెచ్చించారు. ఆరోగ్య ఆసరా కింద రూ.1,465 కోట్ల మేర శస్త్ర చికిత్సలు చేయించుకున్న 24.59 లక్షల మందికి సాయం చేశారు.జగన్, బాబు పాలన మధ్య ఎంతో తేడా! అంశం: కొత్త వైద్య కళాశాలలు జగన్ పాలన: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు. ఇందుకోసం ఏకంగా రూ.8,480 కోట్లు వెచ్చిస్తున్నారు. అన్ని ప్రాంతాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు చేరువ చేస్తున్నారు. ఇప్పటికే విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను ప్రారంభించి ఒకే ఏడాది 750 ఎంబీబీఎస్ సీట్లలో అడ్మిషన్లు కల్పించారు. ఈ విద్యా సంవత్సరం మరో ఐదు, వచ్చే విద్యా సంవత్సరం మిగిలిన ఏడు కళాశాలలు ప్రారంభించేలా ప్రణాళికలు రచించారు. బాబు పాలన: టీడీపీ అధికారంలో ఉండగా ఏ రోజు ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలల ఏర్పాటుకు పాటుపడింది లేదు. వైద్య విద్యను వ్యాపారం చేసి తన వాళ్ల జేబులు నింపడానికే పాటుపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 16 ప్రైవేట్ వైద్య కళాశాలలకు బాబు పాలనలో అనుమతులు ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. అంశం : గ్రామీణ ప్రజల ఆరోగ్యం జగన్ పాలన: పీహెచ్సీ వైద్యులనే గ్రామాలకు పంపి ప్రజలకు వైద్య సేవలు అందించారు. మంచానికే పరిమితం అయిన రోగుల ఇళ్ల వద్దకే వెళ్లి, వారి ఆరోగ్యాలపై వాకబు చేశారు. 2,500 జనాభాకు ఒకటి చొప్పున 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేశారు. వీటిల్లో బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత కలిగిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్వో)లను నియమించారు. తద్వారా 12 రకాల వైద్య సేవలు, 14 రకాల వైద్య పరీక్షలతో పాటు, 105 రకాల మందులను అందుబాటులో ఉంచి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. వీటికి తోడు విలేజ్ క్లినిక్స్లో టెలీ మెడిసిన్ సౌకర్యం ఉండటంతో స్పెషలిస్ట్ వైద్యుల కన్సల్టేషన్ సైతం ఇక్కడే లభిస్తుండటంతో పట్టణాలు, నగరాల్లోని పెద్దాస్పత్రులకు ప్రజలు వెళ్లాల్సిన అవసరం ఉండటం లేదు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వమే ఇళ్ల వద్దకు మందుల డోర్ డెలివరీ ప్రారంభించింది. బాబు పాలన: పల్లె ప్రజలకు సుస్తీ చేస్తే పట్టణాలు, నగరాలకు పరుగులు తీయాల్సిందే. ఫ్యామిలీ డాక్టర్ వంటి కార్యక్రమం ఉండేది కాదు. విలేజ్ క్లినిక్ వ్యవస్థ ఊసే లేదు. పీహెచ్సీలకు వెళితే అక్కడ డాక్టర్లు ఉంటారో లేదో తెలియని దుస్థితి. దీంతో చిన్న అనారోగ్య సమస్య వచ్చినా, వ్యయప్రయాసలకోర్చి పరుగు తీయాల్సిన పరిస్థితి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందుల పంపిణీ, క్రమం తప్పకుండా వారి ఆరోగ్యంపై వాకబు చేసే వ్యవస్థ లేక, ప్రజలు జబ్బు ముదిరి అప్పులపాలయ్యేవారు. అంశం : ఇంటింటా ఆరోగ్య సర్వే జగన్ పాలన: అందరి ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్షను ప్రవేశపెట్టింది. ప్రతి ఇంటిని జల్లెడ పట్టి, వైద్య పరీక్షలు నిర్వహించి వివిధ అనారోగ్య బాధితులను గుర్తించారు. వారికి పట్టణాలు, గ్రామాల్లో ఎక్కడికక్కడ సురక్ష శిబిరాలు నిర్వహించి స్పెషలిస్టు వైద్యులతో ఉచితంగా వైద్య సేవలు అందించారు. మెరుగైన వైద్యం అవసరం ఉన్న వారిని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు తరలించి, ఉచితంగా చికిత్స చేయించారు. బాబు పాలన: ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమం నిర్వహించిందే లేదు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి ఆరోగ్యాన్ని వాకబు చేసి, వాటి పరిష్కారానికి కనీసం ఆలోచించిన పాపాన పోలేదు. అంశం: ఆస్పత్రుల్లో నాడు–నేడు జగన్ పాలన: వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే నాడు–నేడు కార్యక్రమంల ద్వారా ఆస్పత్రుల రూపురేఖలు మార్చేశారు. రూ.16,880 కోట్లతో ఆస్పత్రుల భవనాలకు మరమ్మతులు, పాతవాటి స్థానంలో కొత్తవాటి నిర్మాణం, 17 కొత్త వైద్య కళాశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టారు. జాతీయ ప్రమాణాలతో ఆస్పత్రుల్లో వనరులను సమకూర్చారు. దీంతో 640 ఆస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ (ఎన్క్వాష్), 42 ఆస్పత్రులకు ముస్కాన్, 2022–23లో 3,161 ఆస్పత్రులకు కాయకల్ప గుర్తింపుతో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ నిలిచింది.కేరళ సైతం ఈ అంశాల్లో ఏపీ కన్నా ఎంతో వెనుకబడి ఉంది. ఆస్పత్రుల్లో ఏ ఒక్క వైద్య, సిబ్బంది పోస్టు ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా ఐదేళ్లలో 54 వేల మేర పోస్టులు భర్తీ చేసి రికార్డు సృష్టించారు. 108 వ్యవస్థకు ఊపిరిలూదుతూ రూ.136 కోట్లతో 768 అంబులెన్స్లు సమకూర్చి సేవలు విస్తరించారు. ఫ్యామిలీ డాక్టర్ అమలు కోసం రూ.166 కోట్లతో 104 వాహనాలు సమకూర్చారు. మొత్తం 936 వాహనాలు సేవలందిస్తున్నాయి. బాబు పాలన: రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేసేలా టీడీపీ జమానాలో ఏ ఒక్క కార్యక్రమం చేపట్టలేదు. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది, మందులు, సర్జికల్స్, ఇతర వనరులకు తీవ్ర కొరత ఉన్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగానే బాబు వ్యవహరించారు. 2014–19 మధ్య గుంటూరు జీజీహెచ్లో ఎలుకలు కొరికి శిశువు మృతి చెందడం బాబు పాలనలో దిగజారిన ప్రభుత్వ వైద్య రంగ దుస్థితికి నిదర్శనం. ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన అనంతరం గుణపాఠంతో ఆస్పత్రులను బలోపేతం చేసేలా అడుగులు వేయలేదు. ఐదేళ్ల బాబు పాలనలో కేవలం 4 వేల మేర పోస్టులను మాత్రమే వైద్య శాఖలో భర్తీ చేశారు. బాబు పాలనలో 108, 104 వ్యవస్థలు కూనరిల్లాయి. ఎవరు కావాలో ఆలోచించండి రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగాన్ని ఇంతగా నిర్వీర్యం చేసిన నేత ఒక్క చంద్రబాబు తప్ప దేశంలో మరొకరుండరు. సింగపూర్, యూకే ప్రపంచ స్థాయి రాజధాని అంటూ బాబు బాకాలు ఊదిన అమరావతికి కూత వేటు దూరంలోని గుంటూరు జీజీహెచ్లోనే అప్పట్లో శిశువును ఎలుకలు కొరికి చంపేశాయి. 2019లో అధికారంలోకి రాగానే వైఎస్ జగన్ ప్రభుత్వాస్పత్రులను సంస్కరించారు. వైద్య రంగానికి ఊపిరిలూదారు. పెద్దాస్పత్రులను ఐదేళ్లలో అవయవాలు మార్పిడి చేసే స్థాయికి తీసుకెళ్లారు.ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, విలేజ్ క్లినిక్స్ వంటి వ్యవస్థల ద్వారా ప్రజల వద్దకే సర్కార్ వైద్యాన్ని తీసుకెళ్లారు. ఈ క్రమంలో ప్రభుత్వ వైద్య రంగాన్ని దిగజార్చిన బాబు, ఆ వైద్య రంగానికి ఊపిరిలూదిన వైఎస్ జగన్.. ఈ ఇద్దరిలో ఎవరు కావాలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సముచిత నిర్ణయం తీసుకోకపోతే వైద్యానికి డబ్బు కోసం ఆస్తులు తాకట్టుపెట్టాలి. ఆస్తులు లేని వారు తల తాకట్టు పెట్టే పరిస్థితులు వస్తాయని గుర్తుంచుకోవాలి. -
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
దేశంలోని పేదలలో హిందువులు, క్రైస్తవులు, పార్సీలు అందరూ ఉన్నారని. అందరూ రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందాలని ప్రధాని అన్నారు. అయితే మత ప్రతిపాదికన కాంగ్రెస్ ఒక వర్గానికి మాత్రమే రిజర్వేషన్ కట్టబెట్టేలాని చూస్తున్నట్లు ఆరోపించారు. దీనిపైన కాంగ్రెస్ నేత పవన్ ఖేరా కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మాట్లాడుతూ.. మేము భారత రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటామని పేర్కొన్నారు. మత ప్రతిపాదికన రిజర్వేషన్లను కల్పించడాన్ని రాజ్యాంగం కూడా ఒప్పుకోదని అన్నారు. దీని ప్రకారమే మేము మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా పేర్కొన్నామని అన్నారు.రిజర్వేషన్స్ గురించి మాత్రమే కాకుండా.. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేయడం మీద కూడా పవన్ ఖేరా స్పందించారు. కేజ్రీవాల్కు తప్పకుండా న్యాయం జరుగుతుందని తాము ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.#WATCH | Congress leader Pawan Khera says, "As far as we are concerned, there is no controversy at all, we go by the Constitution of India and the Constitution of India does not allow reservations based on religion. Our manifesto is very clear..." pic.twitter.com/R1h3GkvwXM— ANI (@ANI) May 7, 2024 -
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
ఒడిశాలో ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతుంది. ఈ తరుణంలో బీజేపీ అగ్రనేతలు ఒడిశాపై దృష్టి సారించారు. మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లు బీజేపీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేయనున్నారు. ప్రధాని మోదీ ఇటీవలే బెర్హంపూర్, నబరంగ్పూర్ లోక్సభ స్థానాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే మే 13న ఒడిశాలో మొదటి రౌండ్ ఎన్నికలకు ముందు కమలం నేతలు తమ ప్రచారాన్ని మరింత ఉదృతం చేయనున్నారు.రాష్ట్ర బీజేపీ విశ్వసనీయ సమాచారం మేరకు మే 10న మోదీ భువనేశ్వర్లో రోడ్షో, మే 11న బొలంగీర్లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించనున్నారు. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం మే 8న బరంగ్పూర్, కోరాపుట్లలో బహిరంగ సభలలో పాల్గొననున్నారు. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలు హైవే ప్రాజెక్టులు, ఒడిశాలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఆవశ్యకత వంటి అంశాలను హైలైట్ చేయనున్నారు. బీజేపీ జాతీయ నాయకులు,కేంద్ర మంత్రులతో ఎన్నికల ప్రచారం నిర్వహించగా.. మరోవైపు ఒడిశా అధికార బీజేడీ మాత్రం సీఎం పట్నాయక్ ఆయన సన్నిహితుడు పాండియన్ ద్వయం రాబోయే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం మే 13 నుంచి జూన్ మధ్య నాలుగు సార్లు సుడిగాలు పర్యటనలు చేయనున్నారు. -
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
సాక్షి,కామారెడ్డి: సీఎం రేవంత్ కామారెడ్డి జిల్లాను తీసేయాలని చూస్తున్నాడని, కామారెడ్డి జిల్లా ఉండాలంటే జహీరాబాద్ ఎంపీ సీటు బీఆర్ఎస్ గెలవాలని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం(మే7) కామారెడ్డి జేపీఎన్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్షోలో కేసీఆర్ మాట్లాడారు. ’తెలంగాణకు మోది చేసింది ఏమీ లేదు. బీజేపీ పరిపాలనలో తెలంగాణకు ఎలాంటి న్యాయం జరగలేదు. బీజేపీ పెట్టుబడిదారుల పార్టీ. బీజేపీ మత విద్వేషాలతో ప్రజల మధ్య చిచ్చు పెడుతోంది. కాంగ్రెస్ ఇచ్చిన హమీలు నేరేవేర్చే స్దితిలో లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలొ ఎక్కడా చూసినా కరెంట్ కోతలు. వరి బోనస్ ...బోగస్గా మారింది.అసమర్దులు రాష్ట్రాన్ని ఏలుతున్నారు. ఇచ్చిన హమీలు నేరవేర్చడం లేదు. కాంగ్రెస్ పాలనలో ఐదు నెలలకే రాష్ట్రం ఆగమైపోయింది. బీఅర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలన్నింటిని రద్దు చేశారు. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే’నని కేసీఆర్ స్పష్టం చేశారు.
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
Photos
View allVideo
View allతప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement