మాల్యాకు మరోసారి ఈడీ నోటీసులు | Sakshi
Sakshi News home page

మాల్యాకు మరోసారి ఈడీ నోటీసులు

Published Sat, Apr 2 2016 2:15 PM

మాల్యాకు మరోసారి ఈడీ నోటీసులు - Sakshi

న్యూఢిల్లీ : బ్యాంకుల్లో రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని శనివారం ఈడీ స్పష్టం చేసింది. కాగా విచారణకు హాజరు అయ్యేందుకు మరింత గడువు కావాలని మాల్యా ఇప్పటికే ఈడీని కోరిన విషయం తెలిసిందే.

విజయ్ మాల్యాపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ ఇప్పటికే సమన్లు జారీ చేసింది. మరోవైపు జీఎంఆర్ ఎయిర్‌పోర్టుకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయిన కేసులో నాంపల్లి కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మాల్యా ఇంగ్లండ్ లో తలదాచుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement