శశి వర్గం కొత్త సీఎం అ‍భ్యర్థి ఇతనే | Sakshi
Sakshi News home page

శశి వర్గం కొత్త సీఎం అ‍భ్యర్థి ఇతనే

Published Tue, Feb 14 2017 1:00 PM

శశి వర్గం కొత్త సీఎం అ‍భ్యర్థి ఇతనే - Sakshi

చెన్నై: అనుకున్నట్లే అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ ప్లాన్‌ బీ అమలు మొదలైంది. శశివర్గం సీఎం అభ్యర్థిని ప్రకటించింది. తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళనిస్వామి అంటూ స్పష్టం చేసింది. ఆయనే తమ శాసనసభా పక్ష నేత అంటూ ప్రకటించారు. అదే సమయంలో పన్నీర్‌ సెల్వాన్ని అన్నాడీఎంకే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం పళని స్వామి రహదారులు, ఓడ రేవుల మంత్రిగా ఉన్నారు. ఈయన సేలం జిల్లా ఎడప్పాడి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

ముఖ్యమంత్రి బాధ్యతలకు రాజీనామా చేసిన పన్నీర్‌ సెల్వం.. శశికళకు ఎదురుతిరిగిన విషయం ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, తాను ముఖ్యమంత్రి అయ్యి తీరుతానని శశికళ ప్రకటించడంవంటి పరిణామాలు తెలిసిందే. ఈలోగా సుప్రీంకోర్టు తీర్పు శశికళ సీఎం ఆశలపై పిడుగులా పడిన నేపథ్యంలో శశివర్గానికి వేరే ముఖ్యమంత్రి అభ్యర్థిని తీసుకోవాల్సిరాడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది.

అయితే, వాస్తవానికి తొలుత శశివర్గం నుంచి ముఖ్యమంత్రి రేసులో కే పళని స్వామి, తంబిదురై, సెంగొట్టయన్‌ తాజాగా జయలలిత మేనళ్లుడు దీపక్‌ జయకుమార్‌ పేర్లు కూడా వినిపించాయి. అయితే, తమిళనాడు రహదారులు, ఓడరేవుల బాధ్యతలు నిర్వహిస్తున్న పళని స్వామికి జయలలిత వద్ద మంచి పేరున్నట్లు తెలుస్తోంది. పన్నీర్‌ తర్వాత అంతటి స్థాయి సౌమ్యుడు కూడా పళని స్వామి అని శశివర్గం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయననే సీఎం అభ్యర్థిగా తెరమీదికి తీసుకొచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Advertisement

తప్పక చదవండి

Advertisement