కశ్మీర్‌లో ఎన్ కౌంటర్‌ | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో ఎన్ కౌంటర్‌

Published Sun, Feb 5 2017 1:17 AM

Encounter in Kashmir

ఇద్దరు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భద్రతా దళాలు శనివారం జరిపిన ఎన్ కౌంటర్‌లో హిజ్బుల్‌ ముజాహిదీన్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సోపోర్‌కు చెందిన అమర్‌గఢ్‌ గ్రామం సమీపంలో ఈ ఎన్ కౌంటర్‌ చోటు చేసుకుంది. ఓ వాహనంలో వెళుతున్న ఇద్దరు ఉగ్రవాదుల్ని పోలీసులు గమనించి చుట్టుముట్టారు.

ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు వారిపై ఓ గ్రెనేడ్‌ను విసరడమేగాక కాల్పులకు దిగారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఉగ్రవాదులు సోపోర్‌లో హింసాత్మక చర్యలకు పన్నాగం పన్నినట్టు సమాచారమందటంతో పోలీసులు, భద్రతా దళాలు అప్రమత్తమై వారిని అడ్డుకున్నట్టు పోలీసు ప్రతినిధి ఒకరు తెలిపారు.

Advertisement
Advertisement