Sakshi News home page

హామీల అమల్లో విఫలమయ్యారు

Published Tue, Apr 19 2016 2:44 AM

హామీల అమల్లో విఫలమయ్యారు - Sakshi

మోదీ, మమతపై రాహుల్ ధ్వజం

 రఘునాథ్‌గంజ్: ప్రధాని  మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రజలకు వారు హామీలు మాత్రమే ఇస్తారని, వాటి అమల్లో మాత్రం విఫలమవుతుంటారని విమర్శించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రఘునాథ్‌గంజ్, కందిలలో నిర్వహించిన సభల్లో రాహుల్ పాల్గొన్నారు.

‘మేక్ ఇన్ ఇండియా’ నినాదాన్ని తెచ్చిన ప్రధాని....యువతకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చినా ఇంతవరకు ఆ జాడ లేదన్నారు. మోదీ పాలనలో ఇప్పటివరకు ఒక్కరికీ ఉద్యోగం లభించలేదన్నారు. మార్పు నినాదంతో అధికారంలోకి వచ్చిన మమత...చివరకు ఆమే మారిపోయారని చురకలంటించారు. ఆమె పాలనలో యువతకు ఉపాధి కరువైందన్నారు.

Advertisement
Advertisement