ఫరూక్‌ అబ్దుల్లాకు చేదు అనుభవం.. | Sakshi
Sakshi News home page

ఫరూక్‌ అబ్దుల్లాకు చేదు అనుభవం..

Published Wed, Aug 22 2018 4:42 PM

Farooq Abdullah Heckled During Eid Prayers In Srinagar - Sakshi

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లాకు బుధవారం చేదు అనుభవం ఎదురైంది. బక్రీద్‌ సందర్భంగా బుధవారం శ్రీనగర్‌లోని హజ్రత్‌బాల్‌ మసీదులో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పలువురు అడ్డుకున్నారు. భారత్‌ మాతా కీ జై అన్నందుకు ఫరూక్‌ అబ్ధుల్లాకు నిరసన సెగ ఎదురైంది.

ప్రార్థనలు ప్రారంభించేందుకు ఇమాం సంసిద్ధమవుతున్నప్పటికీ పెద్ద ఎత్తున నినాదాలు ప్రాంగణంలో మిన్నంటడంతో పాటు కొందరు చెప్పులు విసరడంతో ఫరూక్‌ అబ్దుల్లా అక్కడినుంచి వెళ్లిపోయారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ దేశం‍లో సమూల మార్పులు వస్తున్నాయి..దేశం అభివృద్ధి బాటన సాగుతోంది..మనం (కశ్మీర్‌) కూడా పురోగతి సాధించాలన్నారు.

శాంతి సామరస్య సందేశంతోనే తానిక్కడకు వచ్చానన్నారు. శాంతిని వ్యతిరేకించే వారున్నా మనం మన ప్రయత్నాలను ఆపరాదని..ఇలా ఎన్ని రోజులు కశ్మీర్‌ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాలని ఫరూక్‌ అబ్దుల్లా ప్రశ్నించారు.

Advertisement
Advertisement