తిరువనంతపురం: గత లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వెంటాడుతున్న వరుస ఓటములు, కీలక నేతలు పార్టీ నుంచి వైదొలగడం, నాయకత్వ మార్పుపై గందరగోళం.. ఇలా పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరో వివాదంలో ఇరుక్కుంది. బకాయిలు చెల్లించని కేసులో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ చిక్కుల్లోపడ్డారు. తిరువనంతపురం కోర్టులో సోనియాపై కేసు నమోదైంది.
కేరళలో రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ భవనాన్ని నిర్మించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తమకు కాంట్రాక్టు ఇచ్చిందని, దీనికి సంబంధించి 2.8 కోట్ల రూపాయల బకాయిలను తమకు చెల్లించలేదని ఆ రాష్ట్రానికి చెందిన హీథర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆరోపించింది. ఈ విషయం గురించి అడిగితే కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలు తమ వద్ద డబ్బులు లేవని చెబుతున్నారని వెల్లడించింది. తమ బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ హీథర్ కన్స్ట్రక్షన్ కంపెనీ తిరువనంతపురం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో సోనియా గాంధీతో పాటు కేపీసీసీ అధ్యక్షుడు వీఎం సుధీరన్, ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితాల, మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీలకు లీగల్ నోటీసులు పంపించింది.
కేరళలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం మారిన కొన్ని రోజుల్లోనే ఈ కేసు వెలుగు చూసింది.
బకాయిలు చెల్లించలేదని సోనియాపై కేసు
Published Wed, Jun 8 2016 12:17 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement