నడి సంద్రంలో పడవలో మంటలు | Sakshi
Sakshi News home page

నడి సంద్రంలో పడవలో మంటలు

Published Mon, Sep 18 2017 8:07 PM

fire accident in boat

కేకే.నగర్‌: సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లిన సమయంలో మత్స్యకారుల పడవలో అగ్నిప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తు అందులో ఉన్న జాలర్లు ప్రాణాలతో బయటపడ్డారు. దిండుక్కల్‌ జిల్లా సమీపంలోని కుట్టాయి ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అలీ పడవలో ఆరుగురు జాలర్లు చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లారు. దానికి పెట్రోలుతో పనిచేసే మోటారు ఉంది.

నడి సముద్రంలో ఉండగా హఠాత్తుగా పడవలో మంటలు చెలరేగాయి. దిగ్భ్రాంతి చెందిన జాలర్లు వెంటనే సముద్రంలోకి దూకారు. ఆ సమయంలో అటువైపు మరో పడవలో వచ్చినవారు ఆ జాలర్లను రక్షించారు. పడవలో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా వీలుకాలేదు. పడవ పూర్తిగా దగ్ధమైంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement