పంపింగ్ స్టేషన్ నిర్మాణంలో జాప్యం
సాక్షి, ముంబై: నగరంలోని పలు ప్రాంతాలు ఈ ఏడాది కూడా వరద ముప్పు ఎదుర్కోక తప్పదనిపిస్తోంది. దీనికి కారణం పంపింగ్ స్టేషన్ నిర్మాణంలో జాప్యం జరగడమే. అయితే ప్రజలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ బాధలు అధికారులకు పట్టడంలేదని విమర్శిస్తున్నారు. నగరంలో 200 లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలలో ముఖ్యంగా హైటైడ్ సమయంలో అదేవిధంగా భారీ వర్షాల కారణంగా వరద నీరు ముంచెత్తనుంది.
బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) గత కొంత కాలం నుంచి వరద నీరును తొలగించేందుకు కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాలలో వరద నీరును తొలగిపోవడంలేదు. అయితే లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా వరద నీరును తొలగించడం సాధ్యం కాదని కార్పొరేషన్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే తాము లోతట్టు ప్రాంతాల్లో పంప్లను ఏర్పాటు చేశామనీ, అంతేకాకుండా వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని 180 పంప్లను కూడా అందుబాటులో ఉంచామంటున్నారు.
హింద్మాతా, మిలన్ సబ్వే, స్లాటర్ రోడ్, గాంధీ మార్కెట్లు చాలా కీలకమైనవీ. ఇక్కడ ప్రతి ఏడాది వర్షాకాలంలో వరద నీరు ముచెత్తుతోంది. కాగా, వర్లీలో ఉన్న లవ్గ్రోవర్, క్లెవెలాండ్ బండర్ పంపింగ్ స్టేషన్ల ఏర్పాటు వచ్చే ఏడాది మే వరకు పూర్తి కానుంది. అయితే ఈ పంపింగ్ స్టేషన్లను వచ్చే ఏడాది వర్షాకాలంలోనే ఉపయోగంలోకి వస్తాయి. బీఎంసీ చేపట్టిన మురికి కాలువల పూడికతీత సంతృప్తికరంగా లేదని నిపుణులు ఆరోపిస్తున్నారు. ఒక్క భారీ వర్షంతో బీఎంసీ ముందస్తుగా చేపట్టిన పనులన్ని బయట పడుతాయని వారు పేర్కొంటున్నారు.
నగరం ‘సాసర్’ ఆకారంలో ఉందని, నగరంలోని వరద నీరును ఎదుర్కోవడానికి అన్ని పంపింగ్ స్టేషన్లును నిర్వహణలో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీఎంసీ రిటైర్ట్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. కానీ ఇందుకు సంబంధించిన పనులు చాలా నెమ్మదిగా కొనసాగుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. నగరంలో వెస్ట్ర్న్ రైల్వేలో 26 కల్వర్టులు, సెంట్రల్లో 10, హర్బర్లో ఐదు కల్వర్టులు ఉన్నాయి. కానీ రైల్వేల పరిధిలోని మురికి కాలువలను పరిశుభ్రపర్చడానికి బీఎంసీ కేవలం రూ.2.38 కోట్లను కేటాయించింది. అంతేకాకుండా రైల్వే ట్రాక్స్ వెంబడి ఉన్న మైక్రో టన్నెలింగ్ కోసం బీఎంసీ రూ.2 కోట్లను మంజూరు చేసింది.
ఈసారీ వరద ముప్పు తప్పదా?
Published Sat, Jun 7 2014 10:14 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement