కొండచరియలు పడి నలుగురి మృతి | Sakshi
Sakshi News home page

కొండచరియలు పడి నలుగురి మృతి

Published Wed, Apr 1 2015 2:13 PM

Four BRO personnel killed in Uttarakhand

డెహ్రాడూన్: కొండచరియలు విరిగిపడి సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్వో)కు చెందిన నలుగురు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల ఉత్తరాధిన భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. అవన్నీ కొండ ప్రాంతాలైందువల్ల ఇప్పటికే పలు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో రహదారులను పర్యవేక్షించే వీరు మంగళవారం జోషిమఠ్-మలారీ రహదారిని సరిచేస్తుండగా ఒక్కసారిగా భారీ కొండచరియలు విరిగి మీదపడ్డాయి. దీంతో వారు ప్రాణాలు కోల్పోయారు.  మరో ఇద్దరు గాయాల పాలయ్యారు.

Advertisement
Advertisement