మామిడి కాయల తగాదా.. యువతి హత్య! | Sakshi
Sakshi News home page

మామిడి కాయల తగాదా.. యువతి హత్య!

Published Sun, Jun 14 2015 12:49 PM

మామిడి కాయల తగాదా.. యువతి హత్య! - Sakshi

ఫతేపూర్:ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. మామిడి కాయల కోసం చెలరేగిన వివాదంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని ఫతేపూర్ జిల్లా కేశాన్ గ్రామానికి చెందిన శివ్ భూషణ్ అనే వ్యక్తికి మామిడి తోట ఉంది. అయితే కొంతమంది దుండగులు ఆ తోటలో మామిడికాయలను కోసేందుకు విఫలయత్నం చేశారు. ఆ క్రమంలో శివ్ భూషణ్ కు వారికి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. అయితే ఆ క్షణంలో అక్కుడ్నుంచి వెళ్లిపోయిన దుండగులు తరువాత శివ భూషణ్ ఇంటిపై దాడి చేశారు. కాగా, దాడికి పాల్పడ్డ సమయంలో ఇంట్లో శివ భూషణ్ కూతురు మాత్రమే ఉంది.

 

దీంతో ఆ యువతిపై అతి పాశవికంగా దాడి చేసి హత్య చేశారు. అదే క్రమంలో యువతి ఒంటిపై కిరోసిన్ పోసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారు. అయితే ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులకు ముందు అసలు విషయం తెలియలేదు. ఈ అఘాయిత్యానికి పాల్పడింది ఆ దుండగులేనని తేలడంతో  యువతి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఆ దుండగులు ఇంత దారుణానికి పాల్పడతారని అనుకోలేదని తండ్రి శివ్ భూషన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Advertisement
Advertisement