చాక్లెట్ అనుకుని టపాసులు తిని.. చిన్నారి మృతి | Sakshi
Sakshi News home page

చాక్లెట్ అనుకుని టపాసులు తిని.. చిన్నారి మృతి

Published Thu, Nov 12 2015 7:57 AM

చాక్లెట్ అనుకుని టపాసులు తిని.. చిన్నారి మృతి

మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో దీపావళి పండుగ ఓ కుటుంబంలో విషాదం మిగిల్చింది. ఐదేళ్ల అమ్మాయి చాక్లెట్ అనుకుని టపాసులు తినేసి మరణించింది. ఖేడ్ తాలూకాలోని తిసాంగి గ్రామంలో ఉండే దామిని నికమ్ అనే చిన్నారి ఇంటి బయట ఆడుకుంటుండగా అక్కడ కొన్ని టపాసులు పడి ఉన్నాయి.

వాటిని చాక్లెట్ అనుకుని పొరపాటున తినేసిందని ఖేడ్ పోలీసులు తెలిపారు. ఇది చూడగానే ఆ బాలిక తల్లి ఆమెను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించినా, అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. దీనిపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement