బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ప్రిన్సిపాల్ | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ప్రిన్సిపాల్

Published Sun, Jan 4 2015 3:51 PM

బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ప్రిన్సిపాల్ - Sakshi

అగర్తాలా: మహిళలపై, టీనేజ్ బాలికలపై లైంగిక వేధింపులు అంతకంతకూ శృతిమించుతూనే ఉన్నాయి. తాజాగా ఓ మైనర్ బాలిక(12)పై కళాశాల ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన శనివారం త్రిపురాలో చోటు చేసుకుంది. తిలియామురా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న ప్రదీప్ కుమార్ దేయ్(56) ఒక ఇంట్లో అద్దెకు ఉంటూ యజమాని కుమార్తెను తన గది రమ్మని పిలిచాడు.

ఆ బాలిక అతని గది వెళ్లిన  అనంతరం ప్రదీప్ తన ల్యాప్ టాప్ లోని అసభ్యకర సన్నివేశాలు చూపించడమే కాకుండా లైంగిక వేధింపులకు దిగాడు. దీంతో ఆ ప్రిన్సిపాల్ మనసులోని ఉద్దేశ్యాన్ని గ్రహించిన బాలిక అక్కడ ఉన్న అలారమ్ ను మ్రోగించడంతో చుట్టుప్రక్కల వారు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ బాలిక తండ్రి ఇంట్లో లేని సమయంలోనే  ప్రిన్సిపాల్ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు ఎస్పీ యూ భానుమిక్ తెలిపారు.

Advertisement
Advertisement