Sakshi News home page

బాలికపై అత్యాచారం.. సజీవ దహనం

Published Wed, Oct 7 2015 9:36 PM

girl raped and murdered in Coimbatore

చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికపై అత్యాచారం చేసిన ఆగంతకులు అనంతరం ఆమెపై పెట్రోలు పోసి సజీవ దహనం చేశారు. కోయంబత్తూరు జిల్లా వడవల్లి సమీపంలోని వీవీ నగర్‌లో పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఓ బాలిక మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

బాలిక తలపై రెండు చోట్ల ఇనుపరాడ్డుతో కొట్టినట్లుగా బలమైన గాయాలున్నాయి. మృతదేహానికి సమీపంలో వస్త్రాలు సగం కాలిపోయిన స్థితిలో పడి ఉన్నాయి. ఆగంతకులు బాలికపై అత్యాచారం చేసిన తర్వాత రాడ్‌తో తలపై మోది, పెట్రోలు పోసి తగలబెట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి... అత్యాచారం, హత్య కేసుగా నమోదు చేశారు.
 

Advertisement
Advertisement