'తమిళనాడులో మాకు అవకాశం ఇవ్వండి' | Sakshi
Sakshi News home page

'తమిళనాడులో మాకు అవకాశం ఇవ్వండి'

Published Sun, May 8 2016 10:44 PM

'తమిళనాడులో మాకు అవకాశం ఇవ్వండి' - Sakshi

తమిళనాడు: తమిళనాడులో తమ పార్టీ పుంజుకునేందుకు అవకాశం ఇవ్వండంటూ ఎన్నికల ప్రచారంలో మాయవతి అక్కడి ప్రజలను అభ్యర్థించారు. తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆదివారం బీఎస్పీ అధినేత్రి మాయవతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను ఆమె దుమ్మెత్తి పోశారు.

ఈ సందర్భంగా పార్టీనేతలపై విమర్శల జల్లు కురిపించారు. మతవాద రాజకీయాలు, అవినీతి ప్రభుత్వాలను నడిపిన ఘనత బీజేపీ, కాంగ్రెస్‌లకే దక్కుతుందని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వంలో దళితులపై దేశవ్యాప్తంగా వివక్ష జరుగుతోందని మండిపడ్డారు. దళితులను అణగతొక్కడంలో బీజేపీ, కాంగ్రెస్‌లు దొందుదొందేనని మాయవతి ఎద్దేవా చేశారు.

Advertisement
Advertisement