'సనాతన్ సంస్థ' సభ్యుడే సూత్రధారి! | Sakshi
Sakshi News home page

'సనాతన్ సంస్థ' సభ్యుడే సూత్రధారి!

Published Tue, Sep 22 2015 8:48 AM

Govind Pansare death behaind Sanatan Sanstha, sit to under scan

కొల్హాపూర్/ న్యూఢిల్లీ: హేతువాది గోవింద్ పన్సారే హత్యకు 'సనాతన్ సంస్థ' సభ్యుడు రుద్ర పాటిల్ సూత్రధారి అని దర్యాప్తు సంస్థ సిట్ భావిస్తోంది. అతనితోపాటు మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పన్సారే హత్యకు గురయ్యారు. గతవారం సనాతన్ సంస్థ సభ్యుడు  గైక్వాడ్‌ను సిట్ అరెస్టు చేసింది.

ముంబైకి చెందిన ఒకరిని, కర్ణాటకకు చెందిన మరో ఇద్దరిని ప్రశ్నించింది. గైక్వాడ్, ఇతరులు వెల్లడించిన వివరాల ఆధారంగా రుద్ర పాటిల్, సారంగ్ అకోల్కర్‌లకు ఈ హత్యతో సంబంధమున్నట్లు వెల్లడైందని పోలీసు అధికారి వెల్లడించారు.

Advertisement
Advertisement