ఐదువేలమంది కోటీశ్వరులకు నోటీసులు | Sakshi
Sakshi News home page

ఐదువేలమంది కోటీశ్వరులకు నోటీసులు

Published Wed, Dec 14 2016 7:51 PM

ఐదువేలమంది కోటీశ్వరులకు నోటీసులు - Sakshi

గాంధీనగర్‌: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఐటీ అధికారులు గుజరాత్‌లో కొరడా ఝళిపించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదు వేల మంది కోటీశ్వరులకు నోటీసులు పంపించారు. రూ.కోటి కంటే ఎక్కువ మొత్తంలో ఎవరు డిపాజిట్‌ చేశారో వారందరికీ కూడా ఆదాయ పన్ను అధికారులు నోటీసులు అందించారు.

డిపాజిట్‌ చేసిన మొత్తాలకు వివరాలు తెలియజేయాలని నోటిసుల్లో కోరారు. ఆ డబ్బు అక్రమ సొమ్ము అని తేలితే మాత్రం చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. సాధారణంగా రెండున్నర లక్షల కంటే అదనంగా డబ్బు డిపాజిట్‌ చేసిన వ్యక్తులంతా ఐటీ అధికారులకు ఆ డబ్బు తాలూకు వివరాలు అందించాలని పెద్ద నోట్ల రద్దు సందర్భంగా ఆర్బీఐ నిబంధనల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. 

Advertisement
Advertisement