సాక్షి, ముంబై: సొసైటీ భవనాలపై ఏర్పాటుచేసే మొబైల్ టవర్లు, ప్రకటనల బోర్డుల ద్వారా వచ్చే ఆదాయాన్ని దాని సభ్యులు కూడా పొందేలా నియమాల్లో మార్పులు చేయనున్నట్లు సహకారశాఖ మంత్రి హర్షవర్ధన్ పాటిల్ వెల్లడించారు. ఇదివరకు ఇలాంటి నిబంధన లేకపోవడంతో ప్రకటనలతో వచ్చిన ఆదాయాన్ని ఆయా సొసైటీలు భవనాల నిర్వహణకు ఖర్చు చేస్తున్నాయి.
అయితే వాటి లెక్కలను తారుమారు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నా యి. నిధుల్లో చాలా వరకు దుర్వినియోగం అవుతున్నాయనే చెబుతున్నారు. అంతేగాక ప్రకటనల ఆదాయంపై సొసైటీలు ఆడిటింగ్ కూడా జరిపిం చడం లేదు. అందుకే వీటికి సంబంధించిన నియమాల్లో మార్పులు చేస్తే బాగుంటుందని పాటిల్ అభిప్రాయపడ్డారు. ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తం గా 88,433 రిజిస్టర్డ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలు ఉన్నాయి.
ఈ భవనాల్లో ఇళ్లు, వ్యాపార సంస్థ లు, దుకాణాలు ఉన్నాయి. వేలాది సొసైటీలు తమ భవనాలపై మొబైల్ టవర్లు, ప్రకటనల బోర్డులు ఏర్పాటు చేసేందుకు అనుమతించాయి. ఫలితంగా ఇవి నెలకు అద్దె రూపంలో లక్షలాది రూపాయలు పొందుతున్నాయి. ఇక నుంచి ఈ నిధులు దుర్వినియోగం కాకుండా నిరోధించేందుకు ప్రభుత్వం పలు నిబంధనలు విధించనుంది. ఇక నుంచి నిధు ల్లో 50 శాతం మొత్తాన్ని నివాసులకు డివిడెండ్ రూపంలో పంపిణీ చేయాలి.
మిగతా 50 శాతం నగదును సొసైటీ నిర్వహణకు వెచ్చించాలని చట్టాన్ని రూపొంధించనున్నట్లు పాటిల్ చెప్పారు. మొబైల్ టవర్లు, ప్రకటన బోర్డు లు ఏర్పాటుకు అనుమతినిచ్చే ముందు భవనానికి స్ట్రక్చరల్ ఆడిట్ కచ్చితంగా చేయించాలి. ముఖ్యంగా ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న లేదా జంక్షన్ల వద్ద ఉన్న భవనాలకు భారీ డిమాండ్ ఉంటుంది.
ఇక్కడ హోర్డింగులు ఏర్పాటుచేయడానికి వాణిజ్య సంస్థలు పోటీ పడతాయి. అందుకు ఎంతై నా చెల్లించడానికి ముం దుకువస్తాయి. కానీ వీటిని ఏర్పాటు చేయడంవల్ల భవనాలపై అదనపు భారం పడుతుంది. ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశముంది. అదనంగా వచ్చే ఆదాయాన్ని వదులుకునేందుకు సొసైటీ యాజమాన్యాలు సిద్ధంగా లేవు. దీంతో విచ్చలవిడిగా టవర్లు, హోర్డింగులు వెలుస్తున్నాయి. దీంతో స్ట్రక్చరల్ ఆడిట్ తప్పనిసరిగా చేయించుకోవాలని ప్రభుత్వం సొసైటీలను ఆదేశించింది.
ప్రకటనల ఆదాయంలో సగం.
Published Sun, Jun 8 2014 10:33 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement