'మెమన్ను ఉరితీయాల్సిందే' | Sakshi
Sakshi News home page

'మెమన్ను ఉరితీయాల్సిందే'

Published Wed, Jul 29 2015 2:04 PM

'మెమన్ను ఉరితీయాల్సిందే'

ముంబైః ముంబై పేలుళ్ల సూత్రధారి యాకూబ్ మెమన్ను ఉరితీయాల్సిందేనని పేలుళ్ల  బాధిత కుటుంబాలు వాదిస్తున్నాయి. అతనికి మరణేశిక్షే సరైనదంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి  దేవేంద్ర ఫడ్నవీస్కు ఒక వినతిపత్రాన్ని అందజేశాయి. మెమన్కు విధించిన ఉరిశిక్షను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ విధాన్ భవన్లో ఆయనకు మెమోరాండంపై అందజేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ పేలుళ్లలో తమ బంధువులను కోల్పోయిన 1600 మంది దీనిపై సంతకాలు చేశారు. తల్లిని పొగొట్టుకొని నరకం అనుభవిస్తున్నామని దేశ్ముఖ్ తదితరులు ఆవేదన వ్యక్తంచేశారు.

ముంబై వరుస పేలుళ్లలో మెమన్ దోషిగా తేల్చిన టాడా కోర్టు అతనికి ఉరిశిక్ష విధించింది. దీన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. ఈ నేపథ్యంలో అతని క్షమాభిక్ష పిటిషన్ను గతంలో రాష్ట్రపతి తిరస్కరించారు. దీనిపై అతను క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement